ప్రజాధనాన్ని సొంత అవసరాలకు.. సొంతపార్టీ కార్యక్రమాలకు వాడుకోవడంలో రాటు దేలిపోయిన జగన్ రెడ్డి యోగాంధ్రకు డబ్బులు దండగని అంటున్నారు. ప్రజాధనం యోగాంధ్ర వంటి కార్యక్రమాలకు ఖర్చు చేయడం వృధా అని జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. దీనిపై చంద్రబాబును కొంత మంది జర్నలిస్టులు ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాల్లో కొంత మంది గురించి మాట్లాడుకోకపోవడం మంచిదని ఆయన లైట్ తీసుకున్నారు.
రుషికొండ ప్యాలెస్ కోసం ఆరు వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిన ఆయన యోగాంధ్రఖర్చు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం 75 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. జగన్ రెడ్డి ప్రయారిటీలు వేరే ఉంటాయి. ఐ ప్యాక్ .. వాలంటీర్లు.. ఇంటింటికి వైసీపీ వంటి కార్యక్రమాల కోసం వందల కోట్లు ఖర్చుపెడతారు. పార్టీ ప్రచారం కోసం నిర్వహించే సభలకు ప్రజాధనం ఖర్చుపెడతారు. బటన్ నొక్కే కార్యక్రమాలకు సభలు పెట్టి రాజకీయ ప్రసంగాలు చేసి.. ప్రజాధనం ఖర్చుపెడతారు.
సీఎంగా ఉండి… సొంత ఇంటికి వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని తిరిగి ఇవ్వడం లేదు. మూడు కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడేవారు. ఆయన సాక్షి సిబ్బంది సగం మందికి కాంట్రాక్ట్ జాబ్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేశారు. వైసీపీ సోషల్ మీడియా సిబ్బందికి ఆయన రకరకాల పేర్లతో జీతాలిచ్చారు. అన్నీ కళ్ల ముందు ఉంటే.. ప్రధానమంత్రి మోదీ.. దేశ ప్రజల ఆరోగ్య అలవాట్లను పెంచేందుకు ప్రమోట్ చేస్తున్న యోగాను..గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా నిర్వహించడం మాత్రం డబ్బులు దండగంటున్నారు. ఈ వ్యాఖ్యలు మోదీకి తెలిస్తే..ఏమవుతుందో జగన్ రెడ్డి ఆలోచించినట్లుగా లేరన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.