ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే..! తీవ్రత కనిపిస్తుందా..?

వరద వచ్చి ఆరు రోజులు అయింది. ఇప్పుడు బురద మాత్రమే మిగిలింది. వరద వచ్చినప్పుడు సైలెంట్ గా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ..ఆరు రోజుల తర్వాత ఏరియల్ సర్వే నిర్వహించారు. మూడు జిల్లాల్లో హెలికాఫ్టర్‌లో ఆకాశ వీక్షణం చేసి వచ్చారు. నిజానికి ఏ సీఎం అయినా వరద తీవ్రంగా ఉన్నప్పుడే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించి పంట నష్టం అంచనాలను కేంద్రానికి పంపుతారు. కేంద్ర సాయం అండుగుతారు. అయితే ఇంట్లో నుంచి బయట పెట్టకుండానే కేసీఆర్ రూ. నాలుగు వేల నాలుగు వందల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాశారు. అలా రాసిన మూడు రోజుల తర్వాత ఏరియల్ సర్వే చేశారు. నిజానికి ఆయన ఏరియల్ సర్వే చేస్తారని అనుకోలేదు.. హఠాత్తుగా షెడ్యూల్‌లో పెట్టారు.

సాయంత్రం 4 గంటల సమయంలో మరో ఇరువురు మంత్రులు కొడాలి నాని, హోంమంత్రి సుచరితతో కలిసి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణాజిల్లాలో ఏరియల్ వ్యూకు నిర్వహించారు. హెలికాప్టర్ లో మూడు జిల్లాల్లో ఏరియల్ వ్యూ ద్వారా తుపాన్ పీడిత ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతోపాటు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పంట నష్టం నివేదికలను, కూలిన, దెబ్బతిన్న ఇళ్ల వివరాలను తక్షణం పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి అంచనాలేమీ లేకుండా.. ఇంత నష్టం జరిగిందని కేంద్రానికి ఎలా లేఖ రాశారో చాలా మందికి అర్థం కాని విషయం .

హడావుడిగా జగన్ ఏరియల్ సర్వే చేయడం.. వెనుక కారణం లోకేష్ టూరేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లో లోకేష్ వరుసగా పర్యటిస్తున్నారు. మొదట గుంటూరు వెళ్లారు. ఇప్పుడు తూ.గో జిల్లాకు వెళ్లారు. మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. వెళ్లిన చోటల్లా.. రైతులు… వరద బాధితులు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని వాపోతున్నారు. కనీసం వచ్చి చూసిన వారు కూడా లేరంటున్నారు. ఈ విషయం హైలెట్ అవుతూండటంతో వైసీపీ ముందు జాగ్రత్తగా పర్యటనలు ప్రారంభించిందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close