వైసీపీ కూడా చంద్రబాబుకే ప్రచారం..! ఇదేం వ్యూహం..?

పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. చివరి దశకు వచ్చింది. మరో ఆరు రోజుల్లో ఐపో వచ్చింది. ఈ పాదయాత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి.. వీలైనంతగా… ప్రయోజనం పొందడానికి వైసీపీ ప్లాన్లు రెడీ చేసింది. చివరి వారం రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎవరైనా ఇందులో ఏమీ చెప్పుకుంటారు..? జగన్మోహన్ రెడ్డి త్యాగం, ధైర్యం… ఎట్సెట్రా చెప్పుకుంటారు. ఈ కానీ ఈ వారం రోజుల ప్రోగ్రామ్‌లో పాదయాత్ర సంగతి పైపైన చెప్పి.. మిగతా మొత్తం చంద్రబాబు భజన చేయబోతున్నారు. పాజిటివో.. నెగటివో… ఒకటి… జగన్ ప్రసంగాల్లో మాట కంటే ముందు చంద్రబాబు పేరు వచ్చినట్లుగా.. ఈ వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాలన్నీ చంద్రబాబు చుట్టూ తిరగబోతున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వారం రోజుల పాటు పార్టీ నేతలకు చేయాలని నిర్వహించిన పనుల జాబితాలో… ఉన్న ఓ కార్యక్రమం.. ఏమిటంటే.. “నిన్ను నమ్మం బాబూ…” అనే పెద్ద హోర్డింగ్‌ను తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలట. కనీసం 500 మంది గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిచి హాజరైన వారితో “నిన్ను నమ్మం బాబూ” కార్యక్రమానికి మద్దతుగా పార్టీ నెంబర్‌కు మిస్డ్‌ కాల్స్‌ ఇప్పించాలట. ఇలా.. అన్ని కార్యక్రమాలు చంద్రబాబుతోనే ముడి పడి ఉన్నాయి. ఒక్క కార్యక్రమం కూడా.. జగన్ గొప్పగా చెప్పుకునే నవరత్నాలు కూడా… ఇతర అంశాల ప్రస్తావన కూడా లేదు.

ఇప్పటికి.. చాలా స్లోగన్స్ … జగన్ కు మద్దతుగా.. వైసీపీ ప్రచారంలోకి తెచ్చింది. అందులో జగన్ రావాలి.. జగన్ కావాలి కూడా ఉంది. అవన్నీ… యావరేజ్‌గా మిగిలిపోయాయి. ఫేస్ బుక్ పోస్టులకు తప్ప దేనికి పనికి లాలేదు. అందుకే ఇప్పుడు వ్యూహం మార్చారనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబుకు నెగెటివ్ ప్రచారం చేస్తే.. అటోమేటిక్‌గా అది తమకు ప్రయోజనం కలుగుతుందనే భావనలో ఉన్నట్లు ఉన్నారు. అందుకే.. చంద్రబాబుకే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో… ఏదైనా ప్రచారమే ముఖ్యం. అది పాజిటివ్వా.. నెగిటివ్వా.. అనేది కాదు. ప్రజల్లో ముద్ర పడిందంటే.. అది ప్లస్సే అవుతుంది. ఈ విషయంలో జగనే ఉదాహరణ. అయినా.. మరి ఎందుకు.. చంద్రబాబుకే వైసీపీ ప్రచారం చేయాలనుకుంటుందో మరి..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close