రజకులు, క్షురకులు, టైలర్లలకు “జగనన్న చేదోడు”..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా… రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ. పదివేలు అందించే పథకాన్ని నేడు ప్రారంభించనున్నారు. దీనికి జగనన్న చేదోడు అని పేరు పెట్టారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయీబ్రాహ్మణ, టైలర్లను ఆదుకుంటానని.. వారికి ఏటా పదివేల సాయం చేస్తానని.. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఈ పథకంలో భాగంగా మొత్తం 2,47,040 మంది లబ్దిదారులకు రూ.247.04 కోట్ల ఆర్దిక సాయం అందించనున్నారు. డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు.

ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయింది. వాలంటీర్ల ద్వారా ఎంపిక చేశారు. వారి బ్యాంక‌ అకౌంట్లు ఇతర లాంఛనాలు పూర్తి చేశారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయస్తారు. 1,25,926 మంది టైలర్లు, 38,767 మంది నాయీబ్రాహ్మణులు, 82,347 మంది రజకులకు సాయం అందుతుంది. చేతి పెట్టుబడి కోసం ఈ ఆర్దిక సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుంటారని ప్రభుత్వం ఆశిస్తోంది.

అయితే.. మూడు విభాగాల్లోనూ లబ్దిదారులు అతి తక్కువగా ఉండటం మాత్రం.. ఆయా వర్గాల వారిలో అసతృప్తికి కారణం అవుతుంది. రాష్ట్రం మొత్తం మీద టైలర్లు కేవలం 38వేల మంది ఉన్నట్లుగానే ప్రభుత్వం చెబుతోంది. అలాగే టైలర్లు లక్షా ఇరవై ఐదు వేల మంది రజకులు 82వేల మంది మాత్రమే ఉన్నట్లుగా లెక్క తేల్చడంతో.. ఆయా వర్గాల వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్మిక శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో… దాదాపుగా 70 శాతం మంది పథకానికి అనర్హులయ్యారని అంటున్నారు. ఈ నిబంధన మారిస్తే పథకం ఉద్దేశం నెరవేరుతుందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close