చంద్రబాబుతో సమానంగా సెక్యూరిటీ కోసం జగన్ రెడ్డి చేయని పోరాటం లేదు. తనపై తాను దాడులు చేయించుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. తాను బయటకు వస్తే కుప్పలు కుప్పలుగా జనం మీద పడిపోతున్నారని సీన్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు వాటిని చూపించుకుని తనకు సెక్యూరిటీ తక్కువ అయిందని కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. ఆయన పిటిషన్ పై విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని హైకోర్టు తెలిపింది.
జగన్ రెడ్డి సెక్యూరిటీ కోసం కోర్టులకు పోవడం ఇదే మొదటి సారి కాదు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రకారం ఆయనకు జడ్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు. మాజీ సీఎంలకు కేటాయించని భధ్రతను కేటాయిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం. ఆయనకు ఉండే భద్రతతో పోలిస్తే జగన్ రెడ్డి భద్రత చాలా రెట్లు ఎక్కువ. అయినా ఆయన సంతృప్తి చెండడం లేదు. ఆఫ్రికా నియంత గడాఫీ మాదిరి సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ వింగ్ ను ఏర్పాటు చేసుకున్నారు. కనీసం వెయ్యి మంది ఆయన సెక్యూరిటీలో భాగం. మళ్లీ బయటకు వచ్చిదేమీ ఉండదు.
ఇప్పుడు ఆయన సెక్యూరిటీ కోసం ఎందుకు అంత తాపత్రయపడుతున్నారో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. ప్రభుత్వం సరైన సెక్యూరిటీ ఇచ్చింది. జగన్ రెడ్డి జనాలను పిలిపించుకుని మీద పడేలా చేసుకుంటే దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది?. సెక్యూరిటీ కోసం ఇలాంటి నాటకాలు వేస్తున్నారు. అయినా కోర్టులు సెక్యూరిటీలు కల్పించవు. దానికి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ చేసిన సిఫారసులు మేరకు చర్యలు తీసుకోవాలని అంటుంది. అయినా జగన్ రెడ్డి మాత్రం.. ఏదో ఆశతో పిటిషన్లు వేసుకుంటున్నారు.