మేలో పెట్టుబడుల కోసం దావోస్‌కు సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ప్రతి ఏడాది దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం జగన్‌ ఈ సారి వెళ్లనున్నారు. ప్రతీ సారి జనవరిలో జరుగుతుంది. కానీ ఈ ఏడాది వాయిదా పడింది. మేలో ఆఖరి వారంలో జరుగుతోంది. సీఎం జగన్‌ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానించిందని.. ఆయన కూడా అంగీకరించారని ప్రభుత్వం తెలుపుతోంది. మే ఆఖరి వారంలో వారం రోజుల పాటు దావోస్‌లో పర్యటిస్తారు.

సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్‌కు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేసేవారు. ప్రత్యేకంగా స్టాల్ పెట్టేవారు. అయితే సీఎంగా జగన్ వచ్చిన తర్వాత ఏపీ ప్రతినిధి బృందం దావోస్ వెళ్లడం లేదు. అక్కడ్నుంచి ఆహ్వానాలు కూడా అందడం లేదు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ వేగంగా బయటపడటానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఆహ్వానాన్ని పంపింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఏపీపై అపనమ్మకం ఏర్పడింది.

మొదటి ఏడాది విద్యుత్ రంగంలో పీపీఏల రద్దు వివాదం ఉండటంతో ఏపీ గురించి దావోస్‌లో నెగెటివ్ ప్రచారం జరిగింది. ఏపీ గురించి పారిశ్రామికవేత్తలు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రయత్నాలు చేస్తున్నందు వల్ల సీఎంజగన్ దావోస్ వెళ్తారని భావిస్తున్నారు. అందరిలో అనుమానాలు పటా పంచలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close