మేలో పెట్టుబడుల కోసం దావోస్‌కు సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయడం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ప్రతి ఏడాది దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం జగన్‌ ఈ సారి వెళ్లనున్నారు. ప్రతీ సారి జనవరిలో జరుగుతుంది. కానీ ఈ ఏడాది వాయిదా పడింది. మేలో ఆఖరి వారంలో జరుగుతోంది. సీఎం జగన్‌ను వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆహ్వానించిందని.. ఆయన కూడా అంగీకరించారని ప్రభుత్వం తెలుపుతోంది. మే ఆఖరి వారంలో వారం రోజుల పాటు దావోస్‌లో పర్యటిస్తారు.

సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ప్రతి ఏడాది దావోస్‌కు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేసేవారు. ప్రత్యేకంగా స్టాల్ పెట్టేవారు. అయితే సీఎంగా జగన్ వచ్చిన తర్వాత ఏపీ ప్రతినిధి బృందం దావోస్ వెళ్లడం లేదు. అక్కడ్నుంచి ఆహ్వానాలు కూడా అందడం లేదు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ వేగంగా బయటపడటానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఆహ్వానాన్ని పంపింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచ పెట్టుబడిదారుల్లో ఏపీపై అపనమ్మకం ఏర్పడింది.

మొదటి ఏడాది విద్యుత్ రంగంలో పీపీఏల రద్దు వివాదం ఉండటంతో ఏపీ గురించి దావోస్‌లో నెగెటివ్ ప్రచారం జరిగింది. ఏపీ గురించి పారిశ్రామికవేత్తలు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రయత్నాలు చేస్తున్నందు వల్ల సీఎంజగన్ దావోస్ వెళ్తారని భావిస్తున్నారు. అందరిలో అనుమానాలు పటా పంచలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు – జైలు – వాయిదాలు !

ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ న్యాయం కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్లపై తీర్పులు మాత్రం.. అంత వేగంగా రావడం లేదు. ఎప్పుడొస్తాయో తెలియదన్నట్లుగా సీన్...

అనసూయ కన్నీళ్లకి అసలు కారణం ఇదే

యాంకర్, నటి అనసూయ ఇటివలే షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఆమె కన్నీటి పర్యంతమవుతూ కనిపించారు. ఆన్‌లైన్‌ల ట్రోల్స్ వల్లే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని నెట్టింట ప్రచారం...

ప్రభాస్ ‘కల్కి’తో జాగ్రత్త!

ప్రభాస్‌ తో నాగ్ అశ్విన్‌ రూపొందిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’. కమల్‌ హాసన్‌ విలన్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ ఇలా...

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close