అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులందర్నీ కలుస్తారని చెబుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత దేశీయ విమానాల రాకపోకలు.. చార్డెడ్ విమానాలకు.. వారం రోజుల కిందటే అనుమతి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అమిత్ షాలో ఇప్పుడు అంత అర్జంట్‌గా చర్చించాల్సిన అంశాలేమిటన్నదానిపై వైసీపీ వర్గాలు నోరు మెదపడం లేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఎక్కువగా ఆన్ లైన్ … చర్చలు..సమావేశాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా మంత్రివర్గం లాంటి అత్యంత కీలకమైన సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రుల కార్యాలయాలు తెరుస్తున్నప్పటికీ.. నేరుగా వచ్చేవారు తక్కువగానే ఉంటున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత..సడలింపులు ఇచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పెట్టుకోలేదు..మొదటి సారి ఏపీ సీఎం జగన్.. అమిత్ షాతో భేటీకి ఢిల్లీకి వెళ్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నారు. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వస్తూండటంతో..న్యాయవ్యవస్థపైనే వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. అదే సమయంలో..రాజ్యాంగ ఉల్లంఘన విస్తృతంగా జరుగుతోందన్న ఆరోపణలు.. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఎస్‌ఈసీని విషయంలో హైకోర్టు తీర్పును పట్టించుకోనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూండటంతో పాటు… ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ ను గుర్తించకపోవడంతో.. ఇప్పుడా పోస్టులో ఎవరుఉన్నారు..? అనేదానిపై క్లారిటీ లేకపోవడంతో..రాజ్యాంగ సంక్షోభం తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ అమిత్ షాను కలిసేందుకు వెళ్తూండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close