వైఎస్ వివేకాను అడ్డగోలుగా నరికి చంపేసి గుండెపోటు, రక్తపు వాంతులు, చంద్రబాబు చేయించిన హత్య, సునీత చేయించిన హత్య అంటూ రకరకాలుగా మెలికలు తిరిగే కథలు వండిన క్రిమినల్ బ్యాచ్.. దళిత వృద్ధుడు సింగయ్యను కారుతో తొక్కి చంపిన కేసులోనూ అంత కంటే ఎక్కువ క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నెన్ని కథలు చెబుతున్నారో వాళ్లకే అర్థం అవుతుందో లేదో మరి.
సింగయ్య తన కారు కిందే పడి చనిపోయాడని జగన్ రెడ్డి ఒప్పుకున్నారు. ఘటన జరిగిన రోజే తనకు తెలుసని ట్వీట్ చేశారు. కానీ వీడియోలు బయటకు వచ్చే వరకూ కిక్కురమనలేదు. వీడియోలు బయటకు వచ్చిన తర్వాత .. ఒప్పుకున్నారు. అంటే వేరే వాళ్ల మీద తోసేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. ప్రమాదం జరిగిందని తెలిసిన తర్వాత ఆ వృద్ధుడ్ని రోడ్డు పక్కన పడేసిపోవడం ఎందుకు?.వెంటనే ఓ వహికల్ లో ఆస్పత్రికి తలించవచ్చు కదా. అంత కంటే దుర్మార్గం ఉంటుందా?. దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పలేదు. కేసవుతుందని తెలిసి పది లక్షలు అంబటితో ఇప్పించారు. అదే పెద్ద సాయం అన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఇప్పుడు భద్రత అనే కారణం అందుకున్నారు. సరైన సెక్యూరిటీ కల్పించి ఉంటే సింగయ్య తన కారు వద్దకు వచ్చేవాడు కాదు కదా అంటున్నారు జగన్. అసలు ఆయన అక్కడ ఎందుకు ఆగారు.. ఎందుకు జనాల్ని పిలిపించుకున్నారు.. అక్కడ ఆగుతారని ఎవరు వారికి చెప్పారు.. అంతకు మించి కారు దగ్గరకు వస్తే తొక్కి చంపేయాలని రూల్ ఉందా ?. పిచ్చి కథలు చెప్పడంతో వైసీపీ క్రిమినల్స్ ను మించిన బుర్ర ఎవరికీ ఉండదు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు.. చంద్రబాబు కాన్వాయ్ కింద పడి ఎవరూ చనిపోలేదా అని ప్రశ్నించారు. వారికి ఎంత ఇచ్చారు అని అడుగుతున్నారు. నిజానికి చంద్రబాబు కాన్వాయ్ కింద పడిపోయి ఎవరైనా చనిపోయిన ఘటనలు ఉంటే చెప్పాలి. అలాంటివి లేకుండా సొల్లు కబుర్లు చెబుతున్నారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగి ఉంటే చెప్పాలి. ఎక్కడైనా ప్రమాదం జరిగినా అలా రోడ్డు పక్కనే బాధితుడ్ని పడేసిపోతారా?. మనుషుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వని జగన్ రెడ్డి శవాలతో రాజకీయాలు చేస్తారు. చివరికి చచ్చిపోయిన వాళ్లతోనూ రాజకీయాలు చేస్తారు.