గవర్నర్‌తో భేటీకి సతీసమేతంగా వెళ్లిన జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. దాదాపుగా గంట సేపు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల గురించి వివరించారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ.. ఆయన వెంట… తన సతీమణి భారతీరెడ్డిని కూడా తీసుకెళ్లారు. సతీ సమేతంగా రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్ అక్కడ…ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి… తన సతీమణికి పాలనా పరమైన అంశాల్లో ప్రత్యేకమైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంట్లో జరిగే .. అధికారిక సమీక్షలతో పాటు.. కొంత మంది అధికారిక పనుల నిమిత్తం… భారతీరెడ్డిని కలుస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో గవర్నర్ తో భేటీ కోసం.. జగన్ తన సతీమణితో వెళ్లడం.. హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలే అయినప్పటికీ.. పాలనా వైఫల్యాలు …హామీలు నెరవేర్చకపోవడం.. వివాదాస్పద నిర్ణయాలపై…ప్రభుత్వం ఎప్పుడూ వివాదాల్లో ఉంటోంది. శాంతిభద్రతల అంశంపైనా… పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో.. గవర్నర్‌కు తాజా పరిస్థితులను వివరించడానికి…జగన్ గవర్నర్ ను కలిసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో…గవర్నర్‌తో పెద్దగా సమావేశమైన సందర్భాలు లేవు. పైగా.. కేంద్రం కూడా.. దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గవర్నర్‌తో ఎంత సఖ్యతగా… ఉంటే కేంద్రంతో అంత సఖ్యతగా ఉన్నట్లేనన్న అంచనాతో..జగన్ ఆయన వద్దకు వెళ్లారంటున్నారు.

అదే సమయంలో…ఢిల్లీలో సమయం,సందర్భం లేకపోయినా…విజయసాయిరెడ్డి.. జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గురించి…అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు. ఆ సమయంలో.. అనూహ్యంగా ఇతర పార్టీల నేతల నుంచి కూడా… అక్షింతలు పడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో మరో రకమైన ప్రచారం ఊపందుకుంది. అసలే.. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించలేదు. దీని ద్వారా జరుగుతున్న ప్రచారానికి తోడు…జగన్.. అధికారిక వ్యవహారాల్లో భార్య ప్రాధాన్యాన్ని పెంచుతూండటం.. చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close