మేఘా కృష్ణారెడ్డి రూ. వెయ్యి కోట్లు ఇస్తామన్నారు : షర్మిల

రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రెండున్నర లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేస్తున్న మేఘా కృష్ణారెడ్డి తనకు రూ. వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. అయితే ప్రజల సొమ్మును దోచుకుని తనకు ఇస్తానంటున్నారని కాను నిర్మోహమాటంగా తిరస్కరించానని ఆమె చెబుతున్నారు. ఢిల్లీలో కాళేశ్వరం పై కాగ్‌కు ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత ఆమె హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘా కృష్ణారెడ్డి తనకు రూ. వెయ్యి కోట్లు ఇస్తామన్నారని ఆమె చెబుతున్నారు.

కొద్ది రోజులుగా షర్మిల మేఘా కృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. అయితే ఏపీలోని ప్రాజెక్టుల్లో అవినీతి గురించి ఆమె చెప్పడం లేదు . కేవలం తెలంగాణ ప్రాజెక్టుల గురించే మాట్లాడుతున్నారు. ప్రధానగా కాళేశ్వరంలో రూ. 70వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. గవర్నర్‌కు సీబీఐ డైరక్టర్‌కు.. కాగ్‌కూ ఫిర్యాదు చేశారు. అయితే ఇలా ఓ బడా కాంట్రాక్టర్‌ను టార్గెట్ చేయాడనికి కారణం… పార్టీ ఫండ్ కోసం బ్లాక్ మెయిల్ చేయడమేనన్న వాదన కొద్ది రోజులుగా వినిపిస్తోంది. అందుకే షర్మిల స్పందించినట్లుగా తెలుస్తోంది.

తన ప్రెస్ మీట్‌లో షర్మిల .. తెలంగాణలోని అన్ని పార్టీలకూ..నేతలకూ మేఘా కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారని అంటున్నారు. ఆ క్రమంలోనే తనకూ రూ. వెయ్యి కోట్ల డీల్ వచ్చిందని చెబుతున్నారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు. వెయ్యి కోట్లు అంటే చిన్న విషయం కాదు. దీనిపై మేఘా కృష్ణారెడ్డి స్పందించకపోతే నిజమే అనుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టైటిల్ దొరకలేదా త్రివిక్రమ్ ?

ఉగాదికి కొత్త సినిమా కబుర్లతో టాలీవుడ్ సందడిగా మారింది. కొత్తగా ప్రారంభమైన సినిమాలతో పాటు సెట్స్ పై వున్న చిత్రాలు వరుస అప్డేట్ లతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాయి. అయితే మహేష్...

పవన్ పని వారం రోజులే…

డేట్లు ఇచ్చే ముందు కాస్త ఆలోచిస్తారు కానీ ఒకసారి డేట్లు ఇచ్చిన తర్వాత చాలా వేగంగా పని చేస్తారు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ కూడా ఇలానే చాలా ఫాస్ట్ గా...

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై సరైన సమయంలో చర్యలు : సజ్జల

వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని కానీ వెంటనే చర్యలు తీసుకోబోమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వెంటనే చర్యలు...

ఖుషీ.. ఏమిటా రెండు ప్రపంచాలు ?

నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివనిర్వాణ. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత తో ఖుషీ సినిమా రూపొందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close