మేఘా కృష్ణారెడ్డి రూ. వెయ్యి కోట్లు ఇస్తామన్నారు : షర్మిల

రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం రెండున్నర లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేస్తున్న మేఘా కృష్ణారెడ్డి తనకు రూ. వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. అయితే ప్రజల సొమ్మును దోచుకుని తనకు ఇస్తానంటున్నారని కాను నిర్మోహమాటంగా తిరస్కరించానని ఆమె చెబుతున్నారు. ఢిల్లీలో కాళేశ్వరం పై కాగ్‌కు ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత ఆమె హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘా కృష్ణారెడ్డి తనకు రూ. వెయ్యి కోట్లు ఇస్తామన్నారని ఆమె చెబుతున్నారు.

కొద్ది రోజులుగా షర్మిల మేఘా కృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. అయితే ఏపీలోని ప్రాజెక్టుల్లో అవినీతి గురించి ఆమె చెప్పడం లేదు . కేవలం తెలంగాణ ప్రాజెక్టుల గురించే మాట్లాడుతున్నారు. ప్రధానగా కాళేశ్వరంలో రూ. 70వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. గవర్నర్‌కు సీబీఐ డైరక్టర్‌కు.. కాగ్‌కూ ఫిర్యాదు చేశారు. అయితే ఇలా ఓ బడా కాంట్రాక్టర్‌ను టార్గెట్ చేయాడనికి కారణం… పార్టీ ఫండ్ కోసం బ్లాక్ మెయిల్ చేయడమేనన్న వాదన కొద్ది రోజులుగా వినిపిస్తోంది. అందుకే షర్మిల స్పందించినట్లుగా తెలుస్తోంది.

తన ప్రెస్ మీట్‌లో షర్మిల .. తెలంగాణలోని అన్ని పార్టీలకూ..నేతలకూ మేఘా కృష్ణారెడ్డి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారని అంటున్నారు. ఆ క్రమంలోనే తనకూ రూ. వెయ్యి కోట్ల డీల్ వచ్చిందని చెబుతున్నారు. ఇవి తీవ్రమైన ఆరోపణలు. వెయ్యి కోట్లు అంటే చిన్న విషయం కాదు. దీనిపై మేఘా కృష్ణారెడ్డి స్పందించకపోతే నిజమే అనుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close