పవన్ మూడు పెళ్లిళ్లే వైసీపీకి సమస్య…నోటీసులిచ్చిన వాసిరెడ్డి పద్మ !

ఏ వ్యవస్థనైనా రాజకీయం కోసమే వాడుకోవడం వైసీపీ స్టైల్. అది పోలీసు దగ్గర నుంచి మహిళా కమిషన్ వరకూ అదే పరిస్థితి. నిజంగా మహిళలకు అన్యాయం జరిగిన చోట అసలు స్పందనే ఉండని మహిళా కమిషన్.. ఎవరైనా టీడీపీ నేతలో.. జనసేన నాయకులో.. సాధారణంగా మాట్లాడినా సరే వాటికి క్షమాపణ చెప్పాలని నోటీసులు పంపిస్తున్నారు. అవి వివాదాస్పద వ్యాఖ్యలు అని సీఎం జగన్‌కు అనిపించాలి అంతే.

మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. చట్ట ప్రకారమే విడాకులు తీసుకున్నానన్నారు. కావాలంటే మీరూ చేసుకోండని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఈ ఈ వ్యాఖ్యలు సీఎం జగన్‌కు తప్పనిపించాయి. మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్నారు పవన్.. సమాజం ఏమైపోవాలని అని బహిరంగసభలో బాధపడ్డారు. జగన్ బాధను అర్థం చేసుకున్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్.. వెంటనే .. పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేశారు. తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నోటీసుల్ని చూసి.. సామాన్యులు కూడా .. అబ్బా .. ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నరా.ు

పవన్‌కు వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులో మూడు పెళ్లిళ్లపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ..మహిళలను ఉద్దేశించి స్టెపినీ అనే పదం ఆక్షేపణీయం అని మహిళా లోకానికి పవన్ కల్యాణ్ తక్షణం క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. లేకపోతే ఏం చేస్తారో చెప్పలేదు. గతంలో ఓ బాలిక అత్యాచారానికి గురైతే.. రెండు రోజులు పట్టించుకోలేదు. మూడో రోజు చంద్రబాబు పరామర్శకు వెళ్లే సమయంలో .. ఆస్పత్రిలో ఉండి నానా రచ్చ చేశారు. తర్వాత రివర్స్‌లో చంద్రబాబుకు నోటీసులిచ్చారు. కానీ నిజంగా బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. రెండు రోజులకిందట కూడా నెల్లూరులో ఓ యువతి గొంతు కోశారు. ఇలాంటి కేసులు రొటీన్ అయిపోవడంతో పట్టించుకవడం కూడా తగ్గిపోయింది. కానీ వాసిరెడ్డి పద్మ మాత్రం రాజకీయంగా ఎవరికి నోటీసులివ్వాలని.. అనే అంశాల్లో బిజీగా ఉంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close