వివేకా హత్య జరిగి అరవై రోజులు..! హు కిల్డ్ బాబాయ్..?

వైఎస్ ఫ్యామిలీలో అతి ముఖ్యుడైన.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి అరవై రోజులు అయింది. పోలీసులు ఇంత వరకూ ఒక్క ముందడుగు వేయలేకపోయారు. కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా… అచేత స్థితిలో ఉండిపోయారు. ప్రత్యేక దర్యాప్తు బృం౦దాలు… పదకొండు పని చేశాయి. కానీ.. కనీసం… అడుగు ముందుకు వేయలేకపోయారు. అందుకే.. ఇంటర్నెట్‌లో హు కిల్డ్ బాబాయ్ అంటూ… హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇంతకీ.. ఈ కేసు పోలీసులు పట్టుకోలేనంత క్లిష్టమైనదా..?

కళ్ల ముందు సాక్ష్యాలున్నా పోలీసులకేం కనిపించడం లేదు..!

వివేకానందరెడ్డి మృతి వార్త బయటకు ఉదయం తొమ్మిది గంటల సమయంలో తెలిసింది. అప్పటికి నాలుగు గంటల ముందు నుంచి అంటే ఉదయం ఐదు గంటల నుంచి… పులివెందులలో హైడ్రామా నడిచింది. అత్యంత కిరాతకంగా… మనిషిని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడానికి ఆ హైడ్రామా నడిచించింది. చివరికి బయట పడక తప్పలేదు. సాక్ష్యాలు తుడిచేశారు. మృతదేహానికి కుట్లు వేశారు. అసలు.. ఏమీ జరగలేదని చెప్పడానికి ప్రయత్నించారు. ఇలా చేసిన వాళ్లంతా కళ్ల ముందే ఉన్నారు. కానీ ఇంత వరకూ… ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అసలు సూత్రధారులెవరో తెలిసినా ఎందుకు ఆగుతున్నారు..?

స్పష్టమైన సాక్ష్యాలు కళ్ల ముందు ఉన్నా.. పోలీసులు చర్యలు తీసుకోలేకపోవడంతో.. మొదటికే తేడా వచ్చింది. కేసును రాజకీయ రంగు పులిమారు. అదే సమయంలో.. మేమే గెలవబోతున్నామని.. పోలీసు అధికారుల్ని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. పోలీసు అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో వారు సైలెంటయిపోయారు. అదే సమయంలో… ఎస్పీని బదిలీ చేసి పోలీసుల్ని నైతికంగా ఇబ్బంది పెట్టారు. దాంతో… అసలుకే ఆగిపోయింది. హత్య జరిగిన రోజు సీన్ లో ఉన్న ముగ్గురిపై మాత్రం.. సాక్ష్యాల మాయం కేసులు పెట్టి ఊరుకున్నారు. అసలు సూత్రధారాలు నిర్భయంగా తిరుగుతున్నారు.

ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా తేలే చాన్స్ లేదా..?

వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా… వారి పార్టీ గెలిస్తే.. హు కిల్డ్ బాబాయ్ అనేది.. ఓ హ్యాష్ ట్యాగ్‌గానే మిగిలిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది.. రాజకీయ వ్యవస్థ… చట్టం, న్యాయాన్ని ఎంత దారుణంగా… అణిచి వేస్తుందో చెప్పడానికి ఉదాహరణ అవుతుంది. ఇప్పటికే.. పోలీసులు ఏ చర్యలు తీసుకోలేకపోవడంతోనే.. ఈ వ్యవహారం బయట పడుతుంది. ఒక వేళ టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా… ఏదో విధంగా రాజీ చేసుకునే ప్రయత్నాలే చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఎలా చూసినా.. “హు కిల్డ్ బాబాయ్..” అనేది… ఓ బహిరంగ రహస్యంగానే ఉండిపోయే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close