బెజవాడలో మళ్లీ అక్కడే వైఎస్ విగ్రహం..!

విజయవాడలో… కొన్నాళ్ల క్రితం… నగరం నడిబొడ్డున … రోడ్డుకు అడ్డంగా ఉందన్న కారణంగా.. ఓ భారీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పట్లో చాలా వివాదం రేగింది. అప్పటికి వైసీపీలోనే ఉన్న వంగవీటి రాధాకృష్ణ.. అర్థరాత్రి రచ్చ చేశారు. మిగతా నేతలూ హడావుడి చేశారు. కానీ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. వైఎస్ విగ్రహాన్ని తొలగించిన చోట.. ఇప్పుడు… మళ్లీ.. అదే వైఎస్ విగ్రహాన్ని పెట్టాలని.. జగన్ నిర్ణయించారు. ఆ మేరకు.. కార్యాచరణ కూడా ప్రారంభమయింది. ఇప్పుడిదే విజయవాడలో హాట్ టాపిక్.

వైఎస్ మరణం తర్వాత… 2011లో… అప్పట్లో ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో.. నడి రోడ్డుపై .. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజధానిగా మారిన తర్వాత ట్రాఫిక్ పెరిగిపోవడంతో.. విగ్రహం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కృష్ణా పుష్కరాలు కూడా రావడంతో.. ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు.. ఆ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. రోడ్డును వెడల్పు చేశారు. డివైడర్ల మధ్య… అవతార్ సినిమాకు సంబంధించిన ఆకృతులు నిర్మించారు. మొక్కలు పెంచి ఆహ్లాదంగా మార్చారు. దీంతో ఆ రోడ్డు కాస్త ఆకర్షణీయంగా మారింది. కానీ ఇప్పుడు.. ఆ అవతార్ విగ్రహాలను.. పూల మొక్కలను అధికారులు ధ్వంసం చేయించారు. తీసి వేయించారు.

వైఎస్ విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే మళ్లీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. అయితే యథావిధిగా వైఎస్ విగ్రహాన్ని ఆ ప్రదేశంలో ఏర్పాటు చేస్తే రోడ్డును కుదించాల్సి ఉంటుంది. దాంతో సమస్యలు ఎదురవుతాయని భావించి … అవతార్ విగ్రహాలను తొలగించి ఆ ప్రదేశంలోనే వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. అవతార్ విగ్రహాలను, వాటర్ ఫౌంటేన్, ఇతరత్రా వాటిని అధికారులు తొలగించారు. భారీ కార్యక్రమంతో వైఎస్ విగ్రహాన్ని పెట్టడమే మిగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close