ఏపీలోనూ సిక్కిం తరహా విలీనాలే రామ్‌మాధవ్ టార్గెట్..!

భారతీయ జనతా పార్టీ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఓ వైపు అధికారికంగా డేరింగ్.. డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటూ… మరో వైపు రాజకీయంగా వాటిని ప్లస్ పాయింట్లుగా మార్చుకుంటోంది. ఉనికి లేని చోట.. బలంగా జెండా పాతుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కింతో..దాదాపుగా ఆపరేషన్ పూర్తయింది. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం చేపట్టిన కొత్తలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉనికి ఉండేది కాదు. ఇప్పుడు.. సిక్కిం మినహా అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇప్పుడు సిక్కింలో కూడా ప్రతిపక్షం. రెండు, మూడు నెలల్లో సిక్కింలో.. మరో విలీనాన్ని పూర్తి చేసి అధికారపక్షం అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.

సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాన్నే బీజేపీ.. విలీనం లాంటి పెద్ద కర్రతో టార్గెట్ చేసింది.మరి… ఇప్పటి దాకా అడుగు పెట్టలేకపోయిన రాష్ట్రాల్లో ఇంకెంత స్కెచ్ వేయాలి. బీజేపీకి.. కొరకరాని కొయ్యలుగా మిగిలింది…తెలుగు రాష్ట్రాలే. కేరళ, తమిళనాడులతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు భిన్నం. విలీనాలకు ఎంతో అనువైన వాతావరణం కూడా వారికి ఉంది. అందుకే.. బీజేపీ నేతలు.. తెలుగు రాష్ట్రాల విషయంలో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీ విలీనాల విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తున్న రామ్ మాధవ్.. ఆంధ్రప్రదేశ్ కు చెందిననేత. ఆయన తన ప్రావీణ్యాన్ని ఏపీలో చూపించేందుకు చాలా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇందులో కొంత మేర సక్సెస్ అయ్యారు.

ఏపీలో ప్రతిపక్ష హోదాను.. విలీనం ద్వారా.. పొందాలన్న ఆయన ప్రయత్నం ఇంకా సక్సెస్ కాలేదు. కొన్నాళ్ల కిందట వరకూ.. టీడీపీ ఎమ్మెల్యేలపై గురి పెట్టారని… ప్రచారం జరిగింది. ఏపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సునీల్ ధియోధర్ లాంటి నేతలు… తామే ప్రతిపక్షం అని ప్రకటించుకోవడం వెనుక కాన్ఫిడెన్స్ అదే అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సిక్కింలో ఆపరేషన్ ముగిసినందున.. ఇక నెక్ట్స్ టార్గెట్ ఏపీనే అని ప్రచారం జరగడంలో ఆశ్చర్యం లేదనే వాదన రాజకీయవర్గాల్లో ఉంది. మరి కార్యాచరణ ఎలా ఉంటుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close