రాహుల్ అనర్హతపై టీడీపీ, వైసీపీ స్పందించలేదేంటి?

రాహుల్ గాంధీ అనర్హతపై దేశం గగ్గోలు పెడుతుంది. రాహుల్ గాంధీనే వదల్లేదంటే ఇక ప్రతిపక్ష నేతలు మిగలరని.. నియంతృత్వం వచ్చేసినట్లేనని బీజేపీయేతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రజా ఉద్యమానికి సిద్ధం అవుతున్నాయి. కానీ ఏపీ రాజకీయ పార్టీలు మాత్రం పూర్తిగా అసలు ఈ అంశంపై తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. కనీస స్పందన వ్యక్తం చేయలేదు. ఆయా పార్టీలు పూర్తిగా జాతీయ అంశాలు ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకించే అంశాలపై దృష్టి పెట్టాయి.

కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ బీజేపీకి ఉంది. ఇందులో వైసీపీకి బీజేపీ సపోర్ట్ నిన్నామొన్నటి వరకూ ఉంది. దానికి కారణం టీడీపీ. … బీజీపీని వ్యతిరేకించడమే. కానీ ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీని వ్యతిరేకించడం లేదు. దీంతో రాజకీయంగా బీజేపీ కూడా .. టీడీపీని టార్గెట్ చేయడం లేదు. అనవసరంగా బీజేపీపై ఎదురుదాడి చేసి… ఆ పార్టీ మరో పార్టీకి అనుకూలం అయ్యేలా చేయకూడదని రెండు పార్టీలు డిసైడయ్యాయి. అందుకే స్పందించడం మానేశారు.

అయితే వైసీపీ క్యాడర్ మాత్రం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీకి బాగా జరిగిందని సంకలు గుద్దుకుంటున్నారు. ఎందుకంటే జగన్ ను అన్యాయం చేశారట. కేసుల్లో ఇరికించారట. అసలు కాంగ్రెస్ కు అన్యాయం చేసిందే జగన్ కదా అని ఇతరులు అంటే వారి దగ్గర సౌండ్ ఉండదు. ఇక టీడీపీ క్యాడర్ మాత్రం మోదీ నియంతృత్వ తీరును ఖండిస్తున్నారు. రాహుల్ గాంధీపై అనర్హతా వేటుపై తమ అభిప్రాయాలను బలంగానే చెబుతున్నారు. కారణం ఏదైనా ఇప్పుడు ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం తలపడుతున్నాయి. ఇలాంటి సమయంలో జాతీయ అంశాల్లో తలదూర్చి… వేరే పార్టీకి అడ్వాంటేజ్ ఇవ్వాలని రెండూ పార్టీలూ అనుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close