కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ లేనట్లే.. !

తెలంగాణ బయట రెండో బహిరంగసభను కూడా కేసీఆర్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక వైపు చూడటం లేదు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ రేపో, మాపో రాబోతోంది.. అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ ఉనికి మాత్రం లేకుండా పోయింది. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ… తమ ఫస్ట్ టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ ప్రకటించడం వల్లనే … ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారన్న చర్చ ప్రారంభమయింది.

కర్ణాటకలో ఎన్నికలు ముంచుకొస్తున్నా కనీసం కొంత మంది నేతల్ని చేర్చుకునే ప్రయత్నం చేయలేదు. దేవేగౌడ పార్టీ జేడీఎస్ తో పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. మొదట్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలిచినప్పుడల్లా వచ్చిన కుమారస్వామి తర్వాత ముఖం చాటేస్తున్నారు. జేడీఎస్ సపోర్టుగా కర్ణాటకలో అడుగుపెడదామనుకున్న బీఆర్ఎస్ చీఫ్ కు పరిస్థితులు కలిసి రావడం లేదన్న ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకోవడానికి కుమారస్వామి కూడా వెనుకడుగు వేస్తున్నారు. ఆయన కర్ణాటకలో బీఆర్ఎస్ ఎంట్రీని ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది . అందుకే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో తెలుగువారందర్నీ గురి పెట్టి అభ్యర్థుల్ని నిలబెట్టాలనుకున్నా.. చివరికి అసలు పట్టించుకోవడం మానేశారు. దీంతో బీఆర్ఎస్ తొలి అడుగులు .. తడబడినట్లవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close