దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యంత హీనమైన కారణాలతో చర్చల్లోకి వస్తోంది. మహిళల్ని కించ పరచడం, సొంత రాజధానిపై కుట్రలు చేయడం, ఇష్టం వచ్చినట్లుగా నేతల్ని బూతులు తిట్టడం, చివరికి చట్టసభలోనూ మహిళల్ని కించ పరచడం లాంటి వాటితో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలు చేసే వారిని ఈడ్చి తన్నినా సిగ్గు రాలేదు. మాకేంటి సిగ్గు అని అదే దాడి చేస్తున్నారు. రౌడీలను సమర్థిచడం, మహిళల్ని కించపర్చడం, రాజధానిపై కుట్రలు చేయడం వంటి ఏపీ రాజకీయాల్ని చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకునే పరిస్థితి వస్తోంది.
వైసీపీ చేసేది బూతు, వేశ్య రాజకీయాలు !
ఏపీలో ప్రతిపక్షం లేదు. కానీ అధికారికంగా అసెంబ్లీలోనే ప్రతిపక్షం గుర్తింపు లేదు . కానీ రాజకీయ పార్టీగా వైసీపీ ప్రతిపక్షమే. ఇలాంటి ప్రతిపక్షానికి ప్రజల పట్ల కనీస బాధ్యత ఉండాలి. రౌడీల్ని సమర్థించడం లాంటివి చేసినప్పుడే ఈ ప్రతిపక్షానికి బాధ్యత కాదు కదా కనీసం ఆలోచన కూడా లేదని స్పష్టమయింది. ఇది జరిగిన రెండు రోజులకే వేశ్యల రాజధాని అమరావతి అనే విష ప్రచారం ప్రారంభించారు. సొంత మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని రాజకీయ పార్టీ అంటామా ?. వైసీపీ బ్రాండ్ పాలిటిక్స్ అంతా .. ఇలాగే ఉన్నాయి. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.
ప్రజల కోసం పోరాడటం అంటే ఇదా ?
మళ్లీ అధికారంలోకి వస్తాం అని ఆశపడుతున్న పార్టీలు చేయాల్సింది ఏమిటి … ప్రజల కోసం పోరాడటం అంటే ఏమిటో వారికి తెలియదా?. తమ కోసం పోరాడుతున్నామని సొంత రాష్ట్రంపై కుట్రలు చేస్తే ప్రజలు ఊరుకునే అవకాశం ఉండదు. తమ పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై బూతుల దాడి చేస్తే అసలు సహించరు. అయితే ప్రజల్ని పట్టించుకోకుండా వారి కోసం పోరాటం అంటూ వైసీపీ చేస్తున్న రాజకీయం అత్యంత దుర్మార్గం గా ఉంది.
రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీసి.. పెట్టుబడులు రాకుండాచేసే కుట్రే ?
వైసీపీ చేసే రాజకీయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని సొంత అడ్డాలాగా చేసుకుని దోచుకున్నారు. అత్యంత ఘోరంగా జగన్ ఓడిపోవడంతో ఆయనకు రాజకీయ భవిష్యత్ లేదన్న నమ్మకంతో చాలా మంది పెట్టుబడిదారులు వస్తున్నారు. ఇప్పుడు ఆ పెట్టుబడులు ఆపేయడంతో పాటు.. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని లేకుండా చేయాలని అనుకుంటున్నారు. అందు కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఘోరంగా వ్యవహరిస్తున్నారు. జుగుప్సాకరమైన రాజకీయాలు చేస్తున్నారు. ఏపీకి శాపంగా మారుతున్నారు.