వైసీపీ ఎమ్మెల్యే రేటు రు.20 కోట్లా!

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే ఒక్కొక్కరికీ 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఇచ్చి తీసుకెళుతున్నారని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఇవాళ కడపజిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ పట్టిసీమ, జెన్‌కో, అమరావతి భూముల వంటి చోట్ల చేసిన అవినీతి తాలూకు సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. నలుగురైదురు ఎమ్మెల్యేలు వెళ్ళినంత మాత్రాన ఏమీ కాదని అన్నారు. వారు వెళ్ళిన నియోజకవర్గాలలో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారని చెప్పారు. చంద్రబాబు నాడు ఎన్‌టీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేలను తీసుకుని దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు సిగ్గుంటే పార్టీలోకి ఇప్పుడు తీసుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎన్నికలకు వెళదామని, ప్రజలు ఎవరివైపు నిలబడతారో చూద్దామని అన్నారు. చంద్రబాబు ఈ సవాల్‌ను ఛాలంజిగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇంకో ఏడాదైతే టీడీపీ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తారని జగన్ అన్నారు. అప్పుడు నైతికంగా వాళ్ళతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళతామని చెప్పారు. ఎమ్మెల్యేలను కొనటం వల్ల ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని అన్నారు. దేవుడు, ప్రజలు తమవైపు ఉన్నారని జగన్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close