అసెంబ్లీ సమావేశాల్లో అమరావతినే హాట్‌టాపిక్..!

అమరావతి విషయంలో.. అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎన్‌రావు అనే మాజీ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో వేసిన నిపుణుల కమిటీ.. అసెంబ్లీ సమావేశాల్లోపే… నివేదిక ఇవ్వనుంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించిన రోజున..ఈ కమిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడు.. జగన్… అసెంబ్లీ సమావేశాల్లోపు.. నివేదిక ఇవ్వాలని సూచించారు. దానికి వారు అంగీకరించారు. నిజానికి ఈ కమిటీని నియమించిన ఉద్దేశం.. నగరాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి సూచనలు చేయడం. కానీ.. బొత్స మాత్రం.. ఇది కేవలం.. రాజధానికి సంబంధించినదని.. ఈ కమిటీ సిఫార్సు మేరకే.. రాజధానిని కొనసాగిస్తామని చెప్పుకొస్తున్నారు. దీంతో.. రాజధానిపైనే సిఫార్సులు చేస్తుందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీ సమావేశాల్లో అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఒత్తిడి పెంచేందుకు టీడీపీ కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. అన్ని ఇతర పార్టీలు, సంఘాలతో కలిసి.. ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో ఇప్పటివరకూ జరిగిన పురోగతి, రైతులిచ్చిన భూమి, రైతులకు తిరిగి అందించిన రిటర్నబుల్ ప్లాట్లు, రాజధాని అమరావతి ప్రస్తుత పరిస్థితి, అమరావతిపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వంపై రాజధాని నిర్మాణం పట్ల ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అన్ని రాజకీయపక్షాలు ఏకమై రాజధానిపై గళం విప్పాలని భావిస్తున్నారు..

నిజానికి ఇటీవల నిర్వహించిన సీఆర్డీఏ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో 50 శాతం పైబడి జరిగిన నిర్మాణాలను కొనసాగించాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. రైతులకిచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణంపై కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అయితే రాజధాని రైతులు మాత్రం సీఎం జగన్ ప్రకటనలను పెద్దగా నమ్మడం లేదు. నిర్మాణాలను ఆపొద్దని జగన్ చెప్పినప్పటికీ… అధికారుల పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కూడా.. ఊరకే మాట వరుసకు ఆ మాట చెప్పినట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close