పార్టీలో చేరితే కేసులుండవని జేసీకి వైసీపీ ఆఫర్..!

వైసీపీలో చేరితే.. ఎలాంటి కేసులు లేకుండా చేస్తామనే బెదిరింపులతో కూడిన ఆఫర్లు వస్తున్నాయని.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఓడిపోయినప్పటి నుండి.. ఆ పార్టీకి కాస్త దూరం పాటిస్తూ… జగన్‌పై అప్పుడప్పుడూ పొగడ్తల వర్షం కురిపిస్తూ.. రాజకీయంగా.. సంధి కాలంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న జేసీ.. ఒక్క సారిగా.. రూటు మార్చారు. జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి కొందరిని లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాబోయే కాలంలో ఇది మరింత ఎక్కువయ్యే ప్రమాదం కనిపిస్తోందన్నారు. హద్దు మీరి పాలన సాగుతోందని… వైసీపీలో చేరితే.. కేసులుండవని కబురు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి ఇలా.. ఒక్క సారిగా.. బ్లాస్ట్ అవడానికి కారణం.. ఆయనపై .. ఆయన కుటుంబానికి చెందిన వ్యాపారాలపై వరుసగా కేసులు నమోదు చేయడమే. జేసీ కుటుంబానికి 70ఏళ్లుగా ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం ఉంది. అందులో బస్సులు ఎక్కువే. దివాకర్ ట్రావెల్స్ పేరు వినని వారు ఉండరు. అయితే.. ఇటీవలి కాలంలో ఆ బస్సుల రాకపోకలు పెద్దగా కనిపించడం లేదు. దానికి కారణం… ఆ సంస్థకు ఉన్న బస్సుల్లో 70 శాతం బస్సులను.. ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఇతర ట్రావెల్స్ జోలికి పోని అధికారులు ఎవరో కావాలని చెప్పినట్లుగా.. జేసీ బ్రదర్స్ బస్సులను మాత్రమే సీజ్ చేశారు. వారు న్యాయపోరాటం చేసి.. ట్రిబ్యునల్ వద్దకు వెళ్లి.. ఆర్డర్స్ తెచ్చుకున్నా… అధికారులు వదిలి పెట్టడం లేదు. ఈ కారణంగానే.. జేసీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

అధికారులు.. ప్రభుత్వానికి భయపడి తప్పుడు పనులు చేస్తున్నారని… అలా చేయకపోతే.. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసినట్లుగా బదిలీ చేస్తారని.. ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. కక్ష సాధింపు చర్యలు ఉంటాయన్న ఉద్దేశంతోనే.. జేసీ బ్రదర్స్ … కాస్త సంయమనం పాటిస్తున్నారు. రాజకీయంగా.. అంత యాక్టివ్ గా ఉండటం లేదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఆయనను వదిలి పెట్టాలనుకోవడం లేదని… వారిపై.. పెరుగుతున్న ఒత్తిడి… వరుసగా నమోదవుతున్న కేసులతోనే స్పష్టమవుతోంది. దీంతో జేసీ.. తనదైన శైలిని మళ్లీ బయటకు తీశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close