వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు సిబ్బంది ఉన్నా… ఇంటికి వెళ్లి మీ డబ్బులు బ్యాంకుల్లో పడుతున్నాయని చెబుతున్నారు కానీ అలా వచ్చి డబ్బులు మాత్రం పంపిణీ చేయడం లేదు. దీంతో వృద్ధులు బ్యాంకులకు వెళ్లి ఎండలో నానా ఇబ్బందులు పడుతున్నారు.

వలంటీర్లు లేరని .. చంద్రబాబు వల్లే వారు లేరని అందులే డబ్బులు ఇవ్వలేకపోతున్నామని చెప్పుకునేందుకు వైసీపీ ఈ దారుణానికి పాల్పడుతోంది. కానీ సచివాలయ ఉద్యోగులు ఇంటికి వచ్చి పెన్షన్ గురించి చెప్పినప్పుడు ఎందుకు తెచ్చివ్వలేరన్న ప్రశ్న వారికి వస్తుందనే సంగతిని మర్చిపోయారు. అయినా తమ ఇబ్బందులకు ఎవరైనా అధికారంలో ఉన్న వారిని బూతులు తిట్టుకుంటారు కానీ ప్రతిపక్షంలో ఉన్న వారిని తిట్టుకుంటారా ? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారో కానీ.. పండుటాకుల్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందుతున్నారు.

కూలీ మీడియా టీవీ చానళ్లకు అదే పని . ఏ వృద్ధుడు ఎక్కడ చనిపోయాడో కనుక్కుని పెన్షన్ కోసం వెళ్లి చనిపోయాడని ప్రచారం చేస్తున్నాయి. ఓ వ్యక్తి చనిపోతే ఆ వార్త కోసం ఇంత ఈగర్ గా వెయిట్ చేసి వార్తలు వేయడం.. టీవీ చానళ్లకే చెల్లింది. వృద్ధుల్ని ఇలా ఇబ్బంది పెడితే ఎవరికి నష్టం జరుగుతుందో.. ఎన్నికల్లో తేలుతుంది కానీ.. పోయిన ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close