ఇసుక దీక్షపై ఇసుక చల్లుతున్న వైసీపీ..!

చంద్రబాబు చేస్తున్న ఇసుక దీక్షపై.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక చల్లుతోంది. ఈ రోజు నుంచే.. ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించడం.. దానికి తగ్గట్లుగా అధికార యంత్రాంగం మొత్తాన్ని ఇసుకపైనే.. ఉంచాలని నిర్ణయించారు. ఇంత కాలం ఇసుక కొరత వల్ల వచ్చిన ఇబ్బందుల విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత సహజంగానే ఉంటుంది కాబట్టి.. ఆ ఇసుక కొరత.. చంద్రబాబు,లోకేష్ వల్లేనని చెప్పాలన్న ఉద్దేశంతో.. వైసీపీ నేతలు.. చిత్ర, విచిత్రమైన వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగా.. బ్లూ ఫ్రాగ్ అనే ఓఐటీ కంపెనీపై దాడి చేశారు. ఆ కంపెనీపై వచ్చిన ఫిర్యాదు ఏమిటంటే.. శాండ్ సర్వర్‌ను హ్యాక్ చేసి.. నో స్టాక్ బోర్డులు చూపించేలా చేస్తోందట. ఇలా చేస్తోందని మీడియాకు చెప్పుకొచ్చారు కానీ.. ఫిర్యాదు వచ్చిందని.. సోదాలు చేశామని… రెండు, మూడురోజుల తర్వాతే ఏం జరిగిందో తెలుస్తుందని.. సీఐడీ పోలీసులు చెబుతున్నారు. సీఐడీ సోదాల ఆధారంగా వెంటనే… లోకేష్ కు ముడిపెట్టేసి.. జగన్ మీడియా కథనాలు ప్రసారం చేసింది. గతంలో.. డేటాచోరీ కేసు విషయంలోనూ ఈ కంపెనీని తెరపైకి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఇసుక విషయంలోనూ ఆ కంపెనీని వాడుకుంటున్నారు.

ఇసుక దీక్షకు రెండు రోజుల ముందు నుంచే తెలుగుదేశం పార్టీ విస్తృత ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఇసుక కొరత, భవన నిర్మాణ రంగ కార్మికుల కష్టాలు, చంద్రబాబు దీక్షపై పాటను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న వైసిపి నేతల 60మంది పేర్లతో చార్జ్ షీట్ ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం, మరికొంతమంది గుండె పోటు తో మరణించిన వారి వివరాలను తెలుగుదేశం విడుదల చేసింది. వీరి కుటుంబాలకు 25లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఉచిత ఇసుక రావాలి, ఇసుక మాఫియా పోవాలి అంటూ పోస్టర్లును కూడా టీడీపీ నేతలు విడుదల చేశారు.

చంద్రబాబు గతంలో ధర్మపోరాట దీక్షతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 12గంటల దీక్ష చేశారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇసుక కొరత, వైసిపి దాడులను నిరసిస్తూ పోరాటాలను ప్రారంభించింది. పోరాటాన్ని ఉధృతం చేసి ఆయా వర్గాలను ఆకట్టుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే వైసీపీ నేతలు.. వీలైనంతగా.. ఎదురుదాడి చేసేందుకు సీఐడీ పోలీసుల్ని కూడా వాడుకుంటున్నారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close