తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అత్యంత ధనవంతులకు మాత్రం కాకుండా ఉన్నత మధ్యతరగతి వారికి కూడా ఈ పథకంలో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకుంటున్న పిల్లలలో 93 శాతం మందికి నగదు జమ అయ్యాయి. అందరిలోనూ సంతృప్తి కనిపిస్తోంది. నగదుబదిలీ పథకాలను ఇంకా అమలు చేయలేదంటూ సన్నాయి నొక్కుతున్న వైసీపీకి ఇది షాక్ లాంటిదే. అందుకే.. విచిత్రమైన కారణాలతో తెరపైకి వస్తున్నారు.
సాక్షి మీడియా… వైసీపీ, జగన్ రెడ్డి, బొత్స తో సహా వైసీపీ నేతలందరికీ ఒకటే స్క్రిప్ట్ పంపింది. అదేమిటంటే 29 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం ఇవ్వడం లేదు. ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది ?. జగన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో ఎంత మంది చదువుతున్నారో కూడా సరిగ్గా లెక్క ఉండేది కాదు. ఇప్పుడు అంత పక్కాగా 29 లక్షలు అని ఎలా చెబుతున్నారు? . తాము 99.8 శాతం పథకాలను అమలు చేశామని చెప్పుకున్న లెక్కలలాగానే ఇది ఉంటుంది. 30 లక్షలు అంటే ఉజ్జాయింపుగా చెప్పారని అంటారని ఓ లక్ష తగ్గించి చెబుతున్నారు. ఇలాంటి తెలివి తేటలతో పాతాళానికి పడిపోయినా వారికి ఇంకా తెలివి రాలేదు.
కేవలం ఏడు శాతం ఉన్నత వర్గాలకు చెందిన వారికి మాత్రమే తల్లికి వందనం అనర్హులు. ఇలాంటి పథకాల విషయంలో తమకు డబ్బులు రాలేదని చెప్పే తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదు కేంద్రాలు ఏర్పాటు చేసి.. అప్పటికప్పుడు పరిష్కారాలు చూపించబోతున్నారు. వైసీపీ నేతలు ఆ 29లక్షల మంది పిల్లలను తీసుకెళ్లి ఎందుకు ఇవ్వలేదో అధికారుల్ని ప్రశ్నించాలి. లేకపోతే పథకం ఇచ్చారని ఏడ్చారని అనుకుంటారు.
ఒక ఏడాది ఎగ్గొట్టారని జగన్ రెడ్డి అండ్ కో మరో ఏడుపు. జగన్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటే.. పథకం ఇచ్చి నాలుగేళ్లు మాత్రమే. ప్రతి జనవరిలో ఇస్తానని మేనిఫెస్టో పెట్టి.. ఒక ఏడాది ఎగ్గొట్టడానికి జూన్ కు మార్చారు. నాలుగేళ్లు.. 40 లక్షల మందికి.. పదమూడువేలు ఇచ్చారు. ఇందులోనూ చాలా మందికి ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి మోసపు పథకాలకు.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు .. తేడా కనిపిస్తోంది.. నిజాయితీ అమలు మాత్రమే. కానీ తప్పుడు ప్రచారాలతో వైసీపీ ఏడుపు మాత్రం ఆరున్నొక్క రాగాలతో సాగుతోంది.