హరికృష్ణ ని హీరోగా పెట్టి ఎందుకు సినిమా తీశానంటే : వై వి ఎస్ చౌదరి

హరికృష్ణ తన బాల్యంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసినప్పటికీ, టీనేజ్ అయిపోయాక హీరోగా ప్రయత్నించలేదు. అసలు హీరోగా పరిచయం అవ్వాల్సిన వయసులో కానీ హీరోలా చేయాల్సిన వయసులో కానీ నటనకు దూరంగా ఉండిపోయారు. అలాంటి హరికృష్ణ ని మళ్లీ హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టిన ఘనత వైవిఎస్ చౌదరికి చెందుతుంది. అసలు హరికృష్ణ ని హీరో గా తీసుకోవాలని ఎందుకు అనిపించింది అనే ప్రశ్నకు ఒక మీడియా ఇంటర్వ్యూలో ఈ రోజు సమాధానమిచ్చాడు వైవిఎస్ చౌదరి.

వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, ” కృష్ణావతారం , తల్లా పెళ్ళామా, తాతమ్మ కల, రామ్ రహీం లాంటి సినిమాలలో నటించిన తర్వాత నటనకి బ్రేక్ ఇచ్చారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఆయనను మళ్ళీ నటించ వచ్చు కదా చాలాసార్లు అడిగినప్పటికీ, హరికృష్ణ గారు సున్నితంగా తిరస్కరించారు. అయితే నాగార్జునగారితో సీతారామరాజు సినిమా తీసేటప్పుడు ఒక పాత్రకు హరికృష్ణ గారు అనుకుని నాగార్జునకు చెప్పగానే ఆయన కూడా ఒప్పుకున్నాడు. దీంతో హరికృష్ణ సంప్రదిస్తే బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు గారి అబ్బాయి బ్యానర్లో కచ్చితంగా నటిస్తానని కథ కూడా వినకుండానే ఒప్పుకున్నారు. అలా ఆ సినిమా హిట్ అయ్యాక, నామీద ఆయనకి మొదటి నుంచి ఉన్న నమ్మకం మరింత పెరగడంతో ఆయన ప్రధాన పాత్రగా లాహిరి లాహిరి లాహిరి లో సినిమా తీశాను. ఈ సినిమా విజయవంతమైన తర్వాత, రాజకీయంగా ఈయన ఎక్కడైతే పోటీచేసి ఓడిపోయాడో, అక్కడే ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడ అభిమాన సముద్రాన్ని ఆయనకు చూపించి, ఆయనను మరింత ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, అదే ఫంక్షన్లో ఆయనను సోలో హీరోగా పెట్టి సీతయ్య సినిమా ఆనం చేయడం జరిగింది” అని చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా, హరికృష్ణ ని ఈ తరం ప్రేక్షకులకి హీరోగా పరిచయం చేసిన ఘనత మాత్రం వైవిఎస్ చౌదరి కే దక్కుతుంది. వైవిఎస్ చౌదరి మాటల్లో చెప్పాలంటే, 48 ఏళ్ల వయసులో, కమర్షియల్ సినిమాలో హీరోగా పరిచయమై హిట్ సాధించిన నటుడు హరికృష్ణ మాత్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close