కేంద్రమంత్రులపై కవిత ఆరోపణ

హైదరాబాద్: తెలంగాణకు హైకోర్టు ఏర్పాటుకోసం టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్‌లో నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధి విగ్రహంవద్ద ప్లకార్డులు పట్టుకుని హైకోర్టు ఏర్పాటుపై నినాదాలు చేశారు. నిజామాబాద్ ఎంపీ కవిత మీడియాతో మాట్లాడుతూ, కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయటం సర్వ సాధారణమని, అయితే తెలంగాణకు హైకోర్టు ఇంతవరకు ఏర్పడలేదని అన్నారు. దీనికి కారణం నరేంద్రమోడి ప్రభుత్వంలోని కొందరు సీనియర్ మంత్రులు అడ్డుపడటమేనని ఆరోపించారు. ప్రధాని మోడి జోక్యం చేసుకుని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం కదిలేవరకు పార్లమెంట్‌లో తమ ఆందోళనను కొనసాగిస్తామని, పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్ తదితరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరు గతవారం హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌కుకూడా ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close