అమరావతి తొలిదశ 2018 నాటికి పూర్తి: ఏపీ క్యాబినెట్ నిర్ణయం

రాజమండ్రి: వీలైనంత త్వరగా ప్రభుత్వ శాఖలన్నీ విజయవాడకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. రాజమండ్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. ప్రధాని సూచనల మేరకు చిన్న దేశాల్లో ఉన్న అత్యద్భుతమైన రాజధానులను పరిశీలించాలని, కజకిస్థాన్, తుర్క్ మెనిస్థాన్, ఆస్కాన్, అస్నాబాద్ రాజధానుల పరిశీలించాలని కేబినెట్ నిర్ణయించింది. 2018 నాటికి అమరావతి తొలిదశ పూర్తిచేయాలని తీర్మానించింది.

కేబినెట్ సబ్ కమిటీ వేసి రెవెన్యూ విధానాన్ని ఏడాది లోగా మార్చాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి…

కర్నూలు డీఆర్ డీవోకు 2వేల ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం
విశాఖ ఐటీ సెజ్ లో ఈ-సెంట్రిక్ సొల్యూషన్స్ సంస్థకు 300 ఎకరాల కేటాయింపు
పుష్కరాల అనంతరం ఈనెల 25వ తేదీన ప్రతి ఇంట్లో దీపారాధన చేయాలని పిలుపు
పుష్కరాల్లో పనిచేసిన ఉద్యోగులకు సన్మానాలు చేయాలని నిర్ణయం
రాజధాని నిర్మాణానికి స్విస్ ఛాలెంజిలో పాల్గొనాలని చైనా, జపాన్, సింగపూర్, మలేసియా దేశాలకు లేఖలు రాయాలని నిర్ణయం

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన విషయంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షిదే తప్పని తేల్చింది. ఆమె తన సరిహద్దు దాటి పశ్చిమగోదావరి జిల్లాలోకి వెళ్లారని కేబినెట్ అభిప్రాయపడింది.

రాజమండ్రిలోని అర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మద్యాహ్నం రెండుగంటలవరకూ నాలుగంటల పాటు జరిగిన ఈ సమావేశానికి ఇద్దరు ఉపముఖ్య మంత్రులలో ఒకరైన కెఇ కృష్ణమూర్తి మినహా అందరూ హాజరయారు. మోకాలికి సర్జరీ చేయించుకున్నందువల్ల రాలేనని ముందుగానే ఆయన ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close