రోజురోజుకూ పెద్దదవుతున్న తలారి సత్యం మర్డర్ కేసు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గత నెల 9న సినిమా ఫక్కీలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను టిప్పర్ వచ్చి గుద్దేసింది. ఇద్దరు యువకులూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసులో స్థానిక ఎమ్మెల్యే, అధికారపార్టీకి చెందిన జీవన్ రెడ్డి ప్రధాన నిందితుడు. ఆ యాక్సిడెంట్‌లో చనిపోయిన ఇద్దరిలో ఒకరైన తలారి సత్యం కొంతకాలంగా జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్నారు. జీవన్ రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసినపుడు దాఖలు చేసిన అఫిడవిట్‌లో అతనిపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని, అతని ఎన్నిక చెల్లదని తలారి సత్యం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎన్నికల్లో తలారి సత్యం రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేశారు. మరోవైపు తలారి సత్యం బైకును గుద్దిన టిప్పర్ జీవన్ రెడ్డి సోదరుడిదే కావటం విశేషం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తన కొడుకును ఎన్నోరోజులుగా బెదిరిస్తూ వచ్చాడని, తన కొడుకు కొన్నాళ్ళు అజ్ఞాతంలో కూడా ఉండాల్సి వచ్చిందని సత్యం తండ్రి ఆరోపణ. తనకు ప్రాణహాని ఉందంటూ సత్యం మానవ హక్కుల సంఘాన్నికూడా ఆశ్రయించాడని తెలిపారు. తలారి సత్యం మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట గత కొన్నిరోజులుగా రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న టీడీపీ శాసనసభాపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఈ రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో ఇదివరకటి తరహాలో నక్సలైట్ల కార్యకలాపాలు ఉంటేనైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనకు కొంతవరకైనా అడ్డుకట్ట పడేదేమోనని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేరును ఇంతవరకు ఎఫ్ఐఆర్‌లో చేర్చకపోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మధు యాష్కి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు కూడా రేపు నిజామాబాద్ వచ్చి ఈ రిలే నిరాహారదీక్షలలో పాల్గొననున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ వివాదం బాగా ముదిరేటట్లే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close