నాగార్జునకు అన్నీ అలా కలిసి వస్తాయంతే..!

కుమారుడు అఖిల్ కెరీర్‌ను గాడిలో పెట్టడానికి సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్న నాగార్జునకు ఏపీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. చాలా కాలంగా మూడు షోలు, యాభై శాతం ఆక్యుపెన్సీకే పరిమితమైన షోలను పెంచుకునేందుకు అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే చాన్స్ లభించింది. చాలా రోజుల నుంచి ల్యాబ్‌కే పరిమితమైన సినిమా అన్నీ కలిసి రావడంతో విడుదలకు సిద్ధమయింది. కానీ ఏపీలో కలెక్షన్లు ఎలా ఉంటాయోననే ఆందోళన ఉంది.

ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు ప్రభుత్వాన్ని పొగుడుతూ వస్తున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ విషయంలో మంచిదేనని ప్రకటిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వంతో జరిపిన చర్చల ప్రక్రియలో కూడా పాలు పంచుకున్నారు. గత ప్రభుత్వంలో నంది అవార్డుల కమిటీకి కులం ఆపాదించి రచ్చ చేయడంలో ఈ బన్నీ వాసు ముందు ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయకుండా తన సినిమాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి ప్రయత్నాలకు నాగార్జునపేరు కూడా ఉపయోగపడినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్‌తో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌.. నాగార్జునకు వ్యాపార భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత వరకూ ఎలాంటి మినహాయిపులు ఇవ్వడానికి ఆసక్తి చూపించని ప్రభుత్వం కర్ఫ్యూ పొడిగిస్తూ … ధియేటర్లకు కూడా వంద శాతం ఆక్యుపెన్సీకి ఇవ్వడం కాస్త ఆశ్చర్యకరమేనని చెప్పుకోవచ్చు. అఖిల్ సినిమా టిక్కెట్ రేట్లు పెంచితే చూసేవారు తగ్గిపోతారు.. ఉన్న రేట్లకే గిట్టుబాటయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి .. రేట్లు అనేది సమస్య కాదని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close