ఉగ్రవాదుల చెరలో 20మంది భారతీయులు

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశ రాజధాని బమాకో నగరంలో శుక్రవారం ఉదయం రెడిసన్ బ్లూ అనే స్టార్ హోటల్లో కొందరు ఉగ్రవాదులు మారణాయుధాలతో జొరబడి ఆ హోటల్లో ఉన్న సుమారు 170 మందిని తమ అధీనంలోకి తీసుకొన్నారు. వారిలో ఖురాన్ చదవగలిగిన ఏడుగురిని విడిచిపెట్టారు. బందీలుగా పట్టుకొన్న వారిలో కొంతమందిని ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు సమాచారం. హోటల్ కి వచ్చిన అతిధులతో బాటు, ఆ హోటల్లో పనిచేస్తున్న 40మంది ఉగ్రవాదులకు బందీలుగా చిక్కారు. వారిలో 20మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ దృవీకరించింది. వారందరూ దుబాయికి చెందిన ఒక ప్రముఖ సంస్థ తరపున ఆ హోటల్లో గత కొంత కాలంగా పనిచేస్తున్నారు.విదేశాంగ శాఖ అధికారులు మాలీ అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు హోటల్లో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదుల చేతిలో చిక్కుకొన్న భారతీయులు అందరూ క్షేమంగానే ఉన్నట్లు తాజా సమాచారం.

ఆ హోటల్లోకి ఇద్దరు ఉగ్రవాదులే జొరబడినట్లు మొదట భావించినప్పటికీ, కనీసం 5-10 మంది ఉగ్రవాదులు లోపల ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పులలో ఒక ఉగ్రవాది మరణించగా ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం హోటల్ చుట్టూ భద్రతాదళాలు మొహరించి లోపలకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదులు హోటల్ యొక్క ఏడవ అంతస్తులో అన్ని వైపులా కలియ తిరుగుతూ భద్రతాదళాలు లోపలకి ప్రవేశించకుండా పైనుండి వారిపై హ్యాండ్ గ్రెండ్స్ విసురుతూ, తుపాకులతో కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోరాటం ఇంకా ఎప్పటికి ముగుస్తుందో దానిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close