ప్రభుత్వ మోసానికి బలైన అమరావతి రైతులు..! న్యాయం ఎప్పటికి..?

ఓ ప్రభుత్వంలో…
జీవనాధారమైన భూముల్ని.. రాష్ట్రం కోసం..ఇచ్చేశారు వారు.
మరో ప్రభుత్వంలో..
అలా ఇచ్చినందుకు లాఠీదెబ్బలు.. కేసులు.. మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నారు…!
తాము జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి ఇచ్చింది విశాల ప్రయోజనాల కోసమే. కానీ ఆ విశాలం .. అందరిలోనూ లేకపోవడంతోనే.. వారు ఇప్పుడు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 200 రోజుల నుంచి లాఠీ దెబ్బలకు ఓర్చి..కేసుల పాలపడి.. జైలుకెళ్లి.. మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వమే మోసం చేస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే.. మొక్కవోని పట్టుదలతో ఉద్యమం మాత్రం చేస్తున్నారు. ఆ ఉద్యమానికి నేటికి 200 రోజులు.

ప్రతిపక్షనేతగా జగన్ అంగీకరించారు. అమరావతే రాజధాని అని ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. దాంతో.. రాజధాని మార్పు అనేది ఉంటుందని ఎవరూ అనుకోలేదు. కానీ.. జగన్ అన్నింటినీ మర్చిపోయారు. ఎవరేమనుకున్నా.. అమరావతిని నిర్వీర్యం చేయాలనుకున్నారు. ఫలితంగా ఉద్యమం ప్రారంభమయింది. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుండి రాజధాని అమరావతి నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు భూములిచ్చిన 29 గ్రామాల రైతులు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ చేస్తోన్న ఉద్యమం శనివారానికి 200 రోజులు. అమరావతి ఉద్యమానికి మద్ధతుగా దేశ,విదేశాల్లోని 200 నగరాల్లో ఎన్నారైలు శనివారం ‘వెలుగు పూల’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అమరావతి ఉద్యమాన్ని నిర్వహిస్తున్న రైతులు, రైతు కూలీలు, మహిళలు శనివారం 29 గ్రామాల్లో తమ నివాసాల్లోనే ఉండి ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. వీరికి మద్ధతుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో దీక్షకు కూర్చుంటారు.

రాజధాని ఉద్యమానికి మద్ధతుగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో వెబ్ నార్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో జాతీయస్థాయిలో అనేకమంది నేతలు, ప్రముఖులు రైతులనుద్ధేశించి ప్రసంగించనున్నారు. జేఏసీ కన్వీనర్ శివారెడ్డి, జేఏసీ గౌరవ చైర్మన్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, చంద్రబాబునాయుడు, సీతారాం ఏచూరి, డి.రాజా, మనోజ్ భట్టాచార్య, ఫార్వడ్ బ్లాక్ కార్యదర్శి దేవదత్త బిశ్వాస్, ఆరెస్సెస్ అధికార ప్రతినిధి రతన్ షెర్డా, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపీ సబ్బం హరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డితో పాటు.. అనేక మంది జాతీయ స్థాయి నేతలు.. ఈ వెబినార్‌లో పాల్గొని తమ మద్దతును అమరావతి ప్రజలకు తెలియచేస్తారు.

అమరావతి మార్పు నిర్ణయాన్ని… దేశంలో .. ఏ ఒక్కరూ సమర్థించలేదు. అందరూ తుగ్లక్ నిర్ణయంగానే అభివర్ణించారు. కానీ ఏపీలో మాత్రమే. .. ప్రజల కుల , మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడంతో… పాలకులు తాము అనుకున్నట్లుగా చేయగలమనే నమ్మకాన్ని పెంచుకున్నారు. అంతా ఓ ప్రాంతానికే దోచి పెడుతున్నారని ఇతర ప్రాంతాల్లో చిచ్చు పెట్టిన పాలకులు… ఏ ప్రాంతానికి న్యాయం చేయలేకపోతున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. అలా గుర్తించిన రోజున అమరావతి ఉద్యమం.. విస్తృతం అవుతుంది. ఆ రోజు కోసం ఎదురూ అమరావతి రైతులు ఎదురు చూడాలి.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close