రివైండ్‌ 2019: అగ్ర‌ క‌థానాయిక‌ల పోగ్రెస్ రిపోర్ట్‌

హీరోయిన్ల ల‌క్కంటే ల‌క్కే. చేతిలో హిట్లున్నా, లేక‌పోయినా- ఆఫ‌ర్ల‌యితే వ‌స్తూనే ఉంటాయి. ఎందుకంటే… మ‌న‌కు క‌థానాయిక‌ల కొర‌త ఆ స్థాయిలో ఉంది. ఉన్న‌వాళ్ల‌తోనే స‌ర్దుక‌పోవాల్సివ‌స్తుంది. అందుకే హిట్లూ, ఫ్లాపుల సంగ‌తి ప‌క్క‌న పెట్టి, ఆఫ‌ర్ల‌ను ఎగ‌రేసుకుపోతుంటారు. ఇక టాప్ హీరోయిన్ల సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు. వాళ్ల‌యితే అస్స‌లు ఖాళీ ఉండ‌రు. 2019లో కూడా అగ్ర క‌థానాయిక‌లు దూసుకుపోయారు. చేతినిండా సినిమాల‌తో బిజి బిజీగా గ‌డిపేశారు. 2019కి శుభం కార్డు ప‌డిపోతున్న ఈ త‌రుణంలో అగ్ర నాయిక‌ల జాత‌కాలు ఎలా సాగాయో ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే…

అనుష్క‌

‘బాహుబ‌లి’ త‌ర‌వాత ఎందుకో అనుష్క సినిమాల్ని లైట్ తీసుకుంటుంద‌నిపిస్తోంది. తెలుగులో అగ్ర క‌థానాయిక‌గా కొన‌సాగుతున్న స్వీటీ – కొంత‌కాలం సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది. ఈ యేడాది ‘సైరా’లో మాత్ర‌మే క‌నిపించింది. అది కూడా అతిథిగా. త‌న చేతిలో ‘నిశ్శ‌బ్దం’ అనే సినిమా ఉంది. ఈ చిత్రం 2020లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అది మిన‌హాయిస్తే… కొత్త సినిమాల్ని ఒప్పుకున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. 2020లో త‌న బండిని స్పీడ‌ప్ చేస్తుందేమో చూడాలి.

స‌మంత‌

పెళ్ల‌య్యాక ఆచి తూచి నిర్ణ‌యాలు తీసుకొంటోంది స‌మంత‌. దానికి త‌గ్గ‌ట్టే మంచి ఫలితాలూ వ‌స్తున్నాయి. ఈ యేడాది మ‌జిలీ, ఓ బేబీ చిత్రాల‌తో ప‌ల‌క‌రించింది స‌మంత‌. రెండూ హిట్టే. పైగా ఈ రెండు సినిమాలూ త‌న చుట్టూనే తిరిగాయి. త‌మిళంలో చేసిన సూప‌ర్ డీల‌క్స్ న‌టిగా స‌మంత‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ‘మ‌న్మ‌థుడు 2’లో అతిథి పాత్ర‌లో మెరిసింది. మొత్తానికి 2019 స‌మంత‌కు బాగా క‌లిసొచ్చింద‌నే చెప్పాలి.

త‌మ‌న్నా

ఈ యేడాది సంక్రాంతికి ‘ఎఫ్ 2’తో సంద‌డి చేసింది త‌మ‌న్నా. ఆ సినిమాలో త‌నదైన మెరుపులేం లేవు గానీ… ఓ సూప‌ర్ హిట్ సినిమాలో భాగం పంచుకున్నాన‌న్న తృప్తి మిగిలింది. ‘సైరా’లో మాత్రం మెప్పించింది. ఓ వీర‌నారిగా త‌న న‌ట‌న అంద‌రికీ న‌చ్చింది. అభినేత్రి 2 ఫ్లాప్ అయ్యింది. త‌మిళంలో న‌టించిన పెట్రోమాక్స్ అనే సినిమా కూడా నిరాద‌ణ‌కు గురైంది. అయితే 2020 సంక్రాంతిన మ‌ళ్లీ త‌మ‌న్నా క‌నిపించ‌బోతోంది. ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో ఓ ఐటెమ్ గీతం చేసింది త‌మ‌న్నా. అలా 2020 తొలి రోజుల్లోనే త‌మ‌న్నా వెండి తెర‌పై స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిల‌వ‌బోతోంది.

కాజ‌ల్‌

కాజ‌ల్‌కి ఈ యేడాది అస్స‌లు క‌ల‌సి రాలేదు. తెలుగులో సీత‌, ర‌ణ‌రంగం సినిమాల్లో న‌టించింది. రెండూ ఫ్లాపులే. ర‌ణ‌రంగంలో అయితే త‌న స్థాయికి ఏమాత్రం త‌గ‌ని పాత్ర చేసింది. త‌న ఆశ‌ల‌న్నీ 2020పైనే ఉన్నాయి. ‘భార‌తీయుడు 2’లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది కాజ‌ల్‌. విష్ణు స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది. ఇవి రెండూ 2020లోనే వ‌స్తాయి.

కీర్తి సురేష్‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న క‌థానాయిక కీర్తి సురేష్‌. కానీ అదేంటో 2019లో త‌న నుంచి ఒక్క తెలుగు సినిమా కూడా రాలేదు. ఈ యేడాదంతా త‌ను షూటింగుల‌తో బిజీ బిజీగా ఉంది. గుడ్‌ల‌క్ స‌ఖీ, మిస్ ఇండియా చిత్రాలు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని త‌మిళ చిత్రాల్నీ అంగీక‌రించింది.

ర‌ష్మిక‌

అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ల స‌ర‌స‌న చేరిపోయింది ర‌ష్మిక‌. బ‌డా హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు అందేసుకుంటోంది. క‌న్న‌డ సినిమాలూ చేస్తోంది. అయితే 2019 త‌న‌కు క‌ల‌సి రాలేదు. త‌న నుంచి ఈ యేడాది ఒకే ఒక్క సినిమా వ‌చ్చింది. అదే ‘డియ‌ర్ కామ్రేడ్‌’. అది ఫ్లాప్ లిస్టులో చేరింది. మ‌హేష్‌తో క‌లిసి న‌టించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ఈ సంక్రాంతి వ‌స్తోంది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. భీష్మ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇందులో నితిన్ క‌థానాయ‌కుడు.

పూజా హెగ్డే

2019లోనూ పూజా హేగ్డే బాగానే క్లిక్ అయ్యింది. స‌మ్మ‌ర్‌లో వ‌చ్చిన ‘మ‌హ‌ర్షి’ సూప‌ర్ హిట్ అయ్యింది. ‘గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌’తో మ‌రో విజ‌యాన్ని అందుకుంది. ఈ సంక్రాంతికి వ‌స్తున్న ‘అల‌… వైకుంఠ‌పుర‌ములో’నూ త‌నే నాయిక‌. హోస్ ఫుల్ 4లో బాలీవుడ్‌లోనూ సంద‌డి చేసింది.

రాశీఖ‌న్నా

యంగ్‌, మీడియం రేంజు హీరోల‌కు స‌రైన ప్ర‌త్యామ్నాయంగా మారింది రాశీఖన్నా. త‌న కాల్షీట్లు కూడా ఎప్పుడూ బిజీనే. ఈ యేడాది ‘వెంకీ మామా’తో సంద‌డి చేసింది. ఈవారం విడుదల కానున్న ‘ప్ర‌తిరోజూ పండ‌గే’లోనూ త‌నే నాయిక‌. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌’ 2020 ప్రేమికుల రోజున విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close