స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ “గ్రాఫిక్స్” కోసం రూ. 25 లక్షలు చెల్లింపు..!

విశాఖలో నిర్వహించనున్న స్టేట్ గెస్ట్ హౌస్.. ఆకృతులు తయారు చేయడానికి ప్రైవేటు సంస్థను ఎంపిక చేశారు. ఈ మేరకు నిర్వహించిన టెండర్లలో… కేంద్ర ప్రభుత్వ సంస్థ పాల్గొన్నప్పటికీ.. ఆ సంస్థను పక్కన పెట్టి.. ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించారు. ఈ సంస్థ.. “స్టేట్ ఆఫ్ ది ఆర్ట్” స్టైల్లో.. స్టేట్ గెస్ట్ హౌస్ అద్భుతంగా ఉండేలా.. ఆర్కిటెక్చర్ రూపొందించి ఇస్తుంది. కాన్సెప్ట్‌ డిజైన్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సేవలు అందిస్తుంది. అంటే.. వైసీపీ నేతల మాటల్లో చెప్పాలంటే… “గ్రాఫిక్స్‌”ను తయారు చేసి ఇస్తుంది. ఈ గ్రాఫిక్స్ ఆధారంగా ప్రభుత్వం తదుపరి నిర్మాణానికి చర్యలు తీసుకుంటుంది.

విశాఖ మెట్రోపాలిటన్ నగరాభివృద్ధి సంస్థ వీఎంఆర్డీఏ ద్వారా ఈ నిర్మాణం జరుగుతోంది. విశాఖలో గ్రేహౌండ్స్‌ కొండపై 30 ఎకరాల స్థలంలో విశాలమైన స్టేట్ గెస్ట్‌హౌస్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది గెస్ట్ హౌస్ కాదని.. ఆ పేరుతో.. విశాఖ పరిపాలనా రాజధానికి తరలిస్తున్నారన్న విమర్శలు కొద్ది రోజుల నుంచి వస్తున్నాయి. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడాన్నిబట్టి, కార్యనిర్వహక రాజధాని పనులను ప్రభుత్వం చేపట్టినట్టే అని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కౌంటర్ దాఖలు చేయక ముందే నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజ్‌భవన్ కన్నా పెద్దగా… గెస్ట్ హౌస్ ఎందుకని.. అది ఖచ్చితంగా పరిపాలనా రాజధానికి అవసరమైన భవనమేనన్న అనుమానం సాధారణ ప్రజానీకంలో ఏర్పడింది. హైకోర్టులో పిటిషన్లు వేసిన వారు కూడా అదే చెబుతున్నారు. నేరుగా తన చర్యలను న్యాయస్థానం ద్వారా సమర్థించుకోలేక.. ఇలా అడ్డదారుల్లో.. రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close