ఇక్కడ మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్!

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం పోటా పోటీగా జరుగుతోంది. ఏపీలో స్కోర్ 6 ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీ కాగా, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 10గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ముగ్గురు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరబాద్‌లోని జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జంప్ అవబోతున్నారని ఒక ఆంగ్ల పత్రిక ఇవాళ పెద్ద కథనాన్ని ఇచ్చింది. మార్చి 10న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు ముందే వీరు గోడ దూకబోతున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆ కథనమే నిజమైతే టీడీపీలో రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఇద్దరే మిగులుతారు. ఈ ఇద్దరిలో కృష్ణయ్య ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను టీడీపీకి, టీఆర్ఎస్‌కు రెండింటికీ దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. అధికారాన్ని అనుభవించటానికే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతానని చెప్పారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ మాత్రం ఈ ఊహాగానాలను ఖండిస్తున్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు దీనిపై పుకార్లు వ్యాపింపజేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. మొత్తంమీద చూస్తుంటే టీఆర్ఎస్‌లో టీడీపీ విలీనం అనివార్యమనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close