ఏపీలో పొలిటికల్ వేక్యూమ్ ఉందన్న ఉండవల్లి

హైదరాబాద్: ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 18 నెలల కాలంలో పూర్తిగా విఫలమయ్యాడని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నిన్న ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వాధినేతగా చంద్రబాబు ఎంత విఫలమయ్యారో, జగన్ కూడా అంతే విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సంఖ్యాపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మంచి బలం ఉందని, 2004లో టీడీపీ, 1983, 85లో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీలకు అసెంబ్లీలో ఎంత బలం ఉండేదో ఇప్పుడు దానికి రెట్టింపు బలం వైసీపీకి ఉందని ఉండవల్లి చెప్పారు. ఓట్ల శాతం కూడా టీడీపీకి, వైసీపీకి తేడా 1.2 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. ఇంత బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా విఫలమవటం ఇప్పుడు చర్చనీయాంశమయిందని అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రతిపక్షమైనా గట్టిగా పోరాడాలని, కానీ జగన్ అలా చేయటంలేదని వ్యాఖ్యానించారు. కేసుల భయంతోనే జగన్ విఫలమయ్యాడనే వాదన వినిపిస్తోందని చెప్పారు. కేసులు పెట్టేవరకే భయపడాలిగానీ, పాత కేసుల గురించి భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. అది కూడా రు.1,200 కోట్ల అవినీతి జరిగిందని ఛార్జిషీట్‌లో పేర్కొనబడ్డ కేసు అని, దానిని ప్రత్యర్థులు లక్ష కోట్లుగా ప్రచారం చేస్తున్నా వైసీపీ నేతలు కౌంటర్ చేయటంలేదని చెప్పారు.

ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ శూన్యత ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికలనాటికి కూడా తనకూ, జగన్‌కే పోటీ ఉంటుందని, ప్రజలు తనవైపే మొగ్గు చూపుతారని చంద్రబాబు ధీమాగా ఉన్నారని చెప్పారు. మరోవైపు జగన్ కూడా అదే ధీమాతో ఉన్నారని, చంద్రబాబు ఏ హామీ నెరవేర్చలేకపోయారు కాబట్టి ఈసారి ఎన్నికలలో ఆయనకు కాకుండా తనకే ఓటేస్తారని అనుకుంటున్నారని ఉండవల్లి అన్నారు. వీరిద్దరి వలన రాష్ట్రం నష్టపోతోందని చెప్పారు. పవన్ లాంటి మూడో శక్తి రావాలని ఉండవల్లి కోరుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. అలా పవన్ మూడో శక్తిగా రంగప్రవేశం చేస్తే ఉండవల్లి ఆయనతో చేరేటట్లుగాకూడా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close