భారత్ లో చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం

కాశ్మీరులో పాకిస్తాన్, ఐసిస్ జెండాల రెపరెపలు, వేర్పాటువాదుల భారత వ్యతిరేక సభలు, ఊరేగింపులు నిత్యకృత్యం అయిపోయాయి. సరిహద్దులలో కాల్పులు, ఉగ్రవాదుల దాడులు కూడా తరచూ కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులు పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోం మంత్రి నివాసాలపైన గగనతలం నుండి దాడులు చేయవచ్చని నిఘా వర్గాలు చేస్తున్న హెచ్చరికలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి సరిపోవన్నట్లు ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం చాప క్రింద నీరులా చాలా రాష్ట్రాలకు వ్యాపించినట్లు ఇపుడిపుడే నిఘావర్గాలు గుర్తిస్తున్నాయి.

రాజస్థాన్ లోని జయపూర్ లో ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న మహ్మద్ సిరాజుద్దీన్ అనే వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా నేరుగా ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నందుకు ఏంటీ టెర్రర్ స్క్వాడ్ పోలీసులు నేడు అరెస్ట్ చేసారు. అతను ఉగ్రవాదులతో నేరుగా సంభాషిస్తూ వారి ఆదేశాల మేరకు ఐసిస్ భావజాలాన్ని ఇంటర్నెట్ ద్వారా దేశవిదేశాలకు వ్యాపింపజేస్తూ, ఐసిస్ కోసం రిక్రూట్మెంట్లు కూడా చేస్తున్నట్లు కనుగొన్నామని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ త్రిపాఠి మీడియాకు తెలియజేసారు.

ఒక మంచి సంస్థలో మంచి పదవిలో ఉన్న వ్యక్తి కూడా మత ఛాందసవాదంతో ఐసిస్ వంటి కిరాతకులయిన ఉగ్రవాదులతో చేతులు కలపడం చాలా విస్మయం కలిగిస్తోంది. ఉన్నత విద్యావంతులే ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ఇక సమస్యలతో బాధపడుతున్నవారు ఐసిస్ విసురుతున్న ఈ వలలో చిక్కకుండా ఉంటారా? అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు భారత్ కి ఇంతకు ముందు కంటే ప్రమాద స్థాయి పెరిగిందని ఈ అరెస్టులు స్పష్టం చేస్తున్నాయి. కనుక చాప క్రింద నీరులా వ్యాపిస్తున్న ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కూడా అగ్రరాజ్యాలతో సమానంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమయిన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవలసి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

రేవంత్ కు నోటీసులు అంతా తూచ్..!!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు విషయంలో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలిసుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులే అందలేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close