ఐటం సాంగ్ అంటే హంస వాలాల్సిందే

టాలీవుడ్ హీరోయిన్ల జాబితా ఎక్కువవుతున్న ఈ సందర్భంలో స్టార్ హీరోయిన్స్ కూడా తగినంత ముట్టచెబితే ఐటం సాంగ్ కూడా సిద్ధమవుతున్నారు. అయితే హీరోయిన్ గా తెరంగేట్రం చేసి అలా అవకాశాలు రావట్లేదని ఐటం సాంగులనే నమ్ముకుని ఉంది హంసా నందిని. అమ్మడు చేసిన ఐటం సాంగులు కూడా బాగా హిట్ అవుతుండటంతో స్టార్ హీరోల నుండి చిన్న హీరోల దాకా హంసా నందిని ఐటం బాంబ్ అయ్యింది.

మిర్చీ.. మిర్చీ..మిర్చీ లాంటి కుర్రాడే అంటూ మిర్చీ సినిమాలో ప్రభాస్ తో కలిసి మాస్ బీట్ ని చితక్కొట్టిన హంసా లౌఖ్యం సినిమాలో సుర్.. సూపరు.. సుర్.. సూపరు.. అంటూ గోపీచంద్ తో కూడా స్టెప్పులేసి సూపర్ అనిపించుకుంది. మొన్నీమధ్యే విడుదలైన రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమాలో కూడా ఓ సాంగ్ చేసిన అమ్మడు ఇప్పుడు మరో క్రేజీ మూవీలో ప్రత్యేక గీతంలో నర్తించనుంది. అల్లు వారి అబ్బాయి అల్లు శిరీష్ నటిస్తున్న సినిమాలో హంసా ఓ ప్రత్యేక గీతంలో నర్తించడమే కాదు మంచి ప్రాముఖ్యం ఉన్న పాత్రలో కూడా మెరుస్తుందట.

యువత, సోలో సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు శిరీష్ కి జతగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. హంసా అందాలను ఎరగా వేస్తున్న ఈ సినిమా అయినా శిరీష్ కెరియర్ లో మంచి విజయం సాధించి అల్లు వారి పరువును కాపాడుతుందేమో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close