టీడీపీ ప్రభుత్వ తీరుపై మంచి పాయింట్‌లు లేవనెత్తిన జగన్

హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవాళ మంచి పాయింట్‌లు లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారానికి సంబంధించిన కేసులను సాధారణ వడ్డీ కేసులలాగా చిత్రీకరించి ఆ కేసులను నీరుగారుస్తున్నారని జగన్ ఆరోపించారు. విజయవాడలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రమేయమున్న కాల్‌మనీ కేసులలో బలహీనమైన సెక్షన్లు పెట్టారని, ఈ కేసుల్లో బెయిల్‌కు కోర్టుకు కూడా వెళ్ళనవసరంలేదని, ఎమ్మెల్సీ సోదరుడికి అలాగే పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చేశారని జగన్ చెప్పారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన శ్రీకాంత్‌తో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విదేశాలకు వెళ్ళి వస్తే, ఆ నిందితుడి ఆచూకీ గురించి పోలీసులు ఎమ్మెల్యేను కనీసం ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదని ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారం జరిగితే రాష్ట్రమంతటా దాడులు నిర్వహించటమేమిటని ప్రశ్నించారు. మిగిలిన పార్టీలకు చెందిన వడ్డీ వ్యాపారులపై దాడులు చేశారని అన్నారు. ఈ ఆరోపణలన్నింటిలో వాస్తవం లేకపోలేదు. కాల్‌మనీ కేసు జరిగింది ప్రధానంగా విజయవాడలో. ఆరోపణలు వచ్చింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిపై. అయినా కూడా అది రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వ్యవహారంలాగా చిత్రీకరించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన సాధారణ వడ్డీ వ్యాపారులపై దాడులు చేశారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలవారూ ఉన్నారన్న కలర్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు భూముల కేటాయింపులు, రాజధాని అమరావతిలో సింగపూర్ కంపెనీలకు భూముల కేటాయింపుల గురించి కూడా జగన్ గణాంకాలతో సహా ప్రభుత్వంలో అక్రమాలను వివరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close