పాక్ సెంటిమెంటుతో శివసేన భయపెడుతోంది

పాకిస్తాన్ దేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలలో మహారాష్ట్రలోని శివసేన కూడా ఒకటి. అందుకే అది కూడా కాంగ్రెస్ పార్టీతో బాటు ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటనను తప్పుపడుతూ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో లాహోర్ వెళ్లినందుకు మోడీని తీవ్రంగా విమర్శించడమే కాకుండా ఇక మోడీ కూడా ఎంతో కాలం అధికారంలో ఉండరని జోస్యం కూడా చెప్పింది. అందుకోసం ఒక సెంటిమెంటు కూడా ప్రయోగించింది.

“పాక్ నేలపై అడుగుపెట్టిన భారతీయ రాజకీయ నాయకుల రాజకీయ జీవితం పరిసమాప్తం అయిన సంగతి గమనించకుండా మోడీ పాక్ లో పర్యటించి వచ్చేరు. ఇదివరకు లాల్ కృష్ణ అద్వానీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిల రాజకీయ జీవితాలు పాక్ వెళ్ళివచ్చిన తరువాత ఏవిధంగా ముగిసాయో గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. లాల్ కృష్ణ అద్వానీ పాకిస్తాన్ వెళ్లి మహమ్మద్ అలీ జిన్నా సమాధిని దర్శించి వచ్చేరు. ఆ తరువాత నుండి ఆయన రాజకీయ జీవితంలో తిరోగమనం మొదలయి, చివరికి స్వంత పార్టీలోనే పక్కన పెట్టబడ్డారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి లాహోర్ వెళ్లి ముషరఫ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేరు. ఆ తరువాత మళ్ళీ ఆయన మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు మోడీ పాక్ గడ్డపై అడుగుపెట్టారు. లక్షలాది మంది భారతీయుల రక్తంతో తడిసిన పాక్ నేల శాపగ్రస్తమయింది. అందుకే దానిపై అడుగుపెట్టిన భారతీయ నేతలకు కూడా ఆ శాపం తగులుతోంది. దానికి మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఒకవేళ యూపీఏ ప్రభుత్వ హయంలో మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈవిధంగా ఆకస్మికంగా పాక్ పర్యటించి వచ్చినట్లయితే అప్పుడు బీజేపీ ఏవిధంగా స్పందించి ఉండేది? ఇప్పటిలాగే స్వాగతించి ఉండేదా? లేక తప్పు పట్టేదా?” అని సామ్నా పత్రికలో శివసేన బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close