నేటి నుంచి విశాఖ ఉత్సవాలు మొదలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో విశాఖ జిల్లా కూడా ఒకటి. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రతీ ఏటా విశాఖ నగరంలో విశాఖ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం ఎం.జి.ఎం పార్కులో పుష్ప ప్రదర్శనను ప్రారంభించడంతో విశాఖ ఉత్సవాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 3వ తేదీన ఉత్సవాల ముగింపు రోజున కార్యక్రమాలలో పాల్గొంటారు.

నేటి నుంచి మూడు రోజులపాటు సాగే ఈ విశాఖ ఉత్సవాలలో సామాన్య ప్రజలు ఎన్నడూ చూడలేని గరిడిసాములు, కత్తిసాము, తప్పెట గుళ్ళు, వీధి భాగోతాలు, పులివేషాలు వంటి అనేక జానపద కళా ప్రదర్శనలు చూడవచ్చును. అలాగే అరుకు, పాడేరు ప్రాంతాల నుండి వచ్చిన గిరిజన మహిళలు ప్రదర్శించే అత్యద్భుతమయిన నృత్యాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు బారీగా తరలివస్తుంటారు. ఇవేకాక ఈ మూడు రోజుల్లో జానపద, సాంఘిక, పౌరాణిక నాటకాల ప్రదర్శనలు, హరికధలు, బుర్రకధలు ఇంకా అనేక రకాల కళాప్రదర్శనలు నిర్వహించబడతాయి. నగరంలో ప్రధాన ఆకర్షణ కేంద్రాలయిన జాతర పార్కు, విశాఖ సాగరతీరం, కైలాసగిరి, భీమిలి బీచ్, ఎర్రమట్టి దిబ్బలు, తెన్నేటి పార్కు, ఉడా పార్క్ వంటి అనేక చోట్ల కళాకారులు నిర్వహించే ఈ ప్రదర్శనలతో ఊరంతా చాలా కోలాహలంగా పండుగ వాతావరణంతో నిండి ఉంటుంది.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేకమంది కళాకారులు, సినీ తారలు విశాఖ సాగర తీరంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటుంటారు. క్రిందటిసారి ఉత్సవాలలో చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ వంటి అనేకమంది ప్రముఖ సినీతారలు పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close