మరో ఆరుగురు తెలుగు విద్యార్ధులు అమెరికా నుండి వెనక్కి

అమెరికాలో సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీలో చేరడానికి తెలుగు విద్యార్ధులు వరుసగా వెళుతుండటం, వారిని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు ప్రశ్నించి, అవమానించి వెనక్కి తిప్పి పంపేస్తుండటం చూస్తుంటే చందమామ కధలో పట్టువదలని విక్రమార్కుడు కధ గుర్తుకు వస్తోంది. మొదటి బ్యాచ్ విద్యార్ధులను అమెరికా నుండి తిప్పి పంపేసిన తరువాత దేశ వ్యాప్తంగా దానిపై చాల నిరసనలు వ్యక్తం అవడంతో భారత్ లోని అమెరికన్ కౌన్సిలేట్ అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ కూడా ఇచ్చింది. కానీ నేటికీ విద్యార్ధులు అమెరికా వెళుతూనే ఉన్నారు. వారిని వెనక్కి తిప్పి పంపిస్తూనే ఉన్నారు.

మొన్న శనివారం సాయంత్రం మళ్ళీ మరో 6 మంది తెలుగు విద్యార్ధులను అమెరికాలో ప్రవేశించడానికి అనుమతించలేమని చెపుతూ వెనక్కి తిప్పి పంపబడ్డారు. వారితో కలిపి ఇంతవరకు అమెరికా నుండి వెనక్కి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్ధుల సంఖ్య 100కి చేరింది. అయినా ఇంకా చాలా మంది తెలుగు విద్యార్ధులు పట్టువదలని విక్రమార్కుల్లాగా అమెరికా బయలుదేరవచ్చును.

ఈ సమస్య కేవలం తెలుగు విద్యార్ధులకు మాత్రమే ఎదురవుతోందని వెనక్కి తిరిగి వచ్చిన విద్యార్ధులు చెపుతున్నారు. మిగిలినవారికి అదే యూనివర్సిటీలో చేరడానికి అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతిస్తున్నారని వారు చెపుతున్నారు. తమ వద్ద అన్ని పత్రాలు, ఆధారాలు సరిగ్గానే ఉన్నప్పటికీ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కేవలం తమని మాత్రమే వెనక్కి తిప్పి పంపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమస్యకు అసలు కారణం ఏమిటి? దీనికి పరిష్కరం ఏమిటి? దీనిని ఎవరు పరిష్కరిస్తారు? ముఖ్యంగా తెలుగు విద్యార్ధుల పట్లే అమెరికన్ అధికారులు ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? దానికి కారణాలు ఏమిటి? అనే విషయంపై కూడా ఆరా తీసి తెలుసుకోవలసిన అవసరం ఉంది.

ఈ ప్రశ్నలకు సరయిన సమాధానాలు రాకుండా తెలుగు విద్యార్ధులు అమెరికా బయలుదేరడం అంత వివేకమనిపించుకోదు. భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ సమస్యను పరిష్కరిస్తామని అంతవరకు విద్యార్ధులను తమ అమెరికా ప్రయాణాలను వాయిదా వేసుకోమని కోరారు. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా ఇంకా విద్యార్ధులు అమెరికా బయలుదేరుతూనే ఉన్నారు. బహుశః ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకొని ఆ విశ్వవిద్యాలయానికి, విమాన టికెట్లకి డబ్బు చెల్లించి ఉన్న కారణంగానే విద్యార్ధులు రిస్క్ తీసుకొని అమెరికా బయలుదేరుతున్నరేమో? ఈ విషయంలో విద్యార్ధుల, వారి తల్లి తండ్రుల ఆందోళన అర్ధం చేసుకొని, విద్యార్ధులు నష్టపోకుండా చూసే బాధ్యత కేంద్రప్రభుత్వానిదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close