“ధర్మ పోరాటదీక్ష” ఫలించిందా..? టీడీపీ అంచనాలేమిటి..?

పార్లమెంట్ ను ప్రతిపక్షాలు నడవనీయలేదంటూ… ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఒక రోజు దీక్ష చేశారు. నిజానికి ఓ ప్రధానమంత్రి విపక్షాలకు వ్యతిరేకంగా దీక్ష చేయడమనే కాన్సెప్ట్ కొత్తది. అందుకే మీడియాతో పాటు ప్రజలు కూడా ఆసక్తి చూపించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ దీక్షను తూ.తూ మంత్రంగా చేశారు. అసలు చేశారో లేదో కూడా తెలియదు. ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షెడ్యూల్లో టీ, టిఫినీలు, డిన్నర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో విమర్శలొచ్చాయి. కేంద్రం తీరుకు నిరసనగా చంద్రబాబు కూడా దీక్ష అనేసరికి.. అందరూ మోదీ దీక్షతో పోల్చడం ప్రారంభించారు. ఇదీ కూడా అలాంటిదే అనుకున్నారు. అదే సమయంలో.. జగన్ తరచూ చేసే దీక్షలు కూడా సమీక్షకు వచ్చాయి. జగన్ రెండు రోజుల దీక్ష పేరుతో..ఈ రోజు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకూ దీక్షా వేదికపై కూర్చుని వెళ్లిపోయేవారు.

ఈ అనుభవాలతో ముఖ్యమంత్రి అత్యంత బిజీషెడ్యూల్ మధ్య…అదీ పుట్టిన రోజు నాడు.. పన్నెండు గంటల దీక్ష చేయడం అసాధ్యం అనుకున్నారు. కానీ చంద్రబాబు .. కచ్చితంగా ఏడు గంటలు అనగానే… ఏడు గంటకల్లా దీక్ష ప్రారంభించారు. సాయంత్రం ఏడు గంటల వరకు కదల్లేదు. కనీసం మంచి నీళ్లు కూడా ముట్టకుండా తన ధర్మ పోరాట దీక్షపై చిత్తశుద్ధి చూపించారు. దీంతో ప్రజల్లో ఆశ్చర్యం వ్యక్తం అయింది. మొదట్లో తేలిగ్గా తీసుకున్న వారే.. తర్వాత ..చంద్రబాబును శభాష్ అన్నారు. చంద్రబాబు పట్టుదలకు నిదర్శనం అని పొగడ్తల వర్షం కురిపించారు.

ఇక ప్రసంగం విషయంలోనూ చంద్రబాబు అదుర్స్ అనిపించారు. కొత్త విషయాలేమీ చెప్పలేదు. అన్నీ గతంలో చెప్పినవే. అయినా చంద్రబాబు.. కేంద్రంపై తన పోరాట సంకల్పాన్ని ప్రభావ వంతంగా ప్రజల ముందు ఉంచారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలు.. ప్రజలకు ఎలా ద్రోహం చేస్తున్నాయో వివరించారు. అంతుక మించి ఏపీ ప్రయోజనాలను వారు ఢిల్లీలో ఎలా తాకట్టు పెట్టారో ప్రజలకు వివరించగలిగారు. తన పోరాట ప్రణాళిక..తన లక్ష్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.

పకడ్బందీ ప్రణాళికతో చంద్రబాబు దీక్షకు… 175 నియోజకవర్గాల్లోనూ.. సంఘీభావదీక్షలుకూడా… అంతే సిన్సియర్ గా జరగడం తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఏపీలో ఏ రాజకీయ పార్టీ.. ఏ ఉద్యమం చేసిన అది రాజకీయమే. అయితే.. రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటే ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. తాము రాజకీయంతో పాటు.. రాష్ట్ర ప్రయోజనాలకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రజలకు చంద్రబాబు ఇన్ డైరక్ట్ గా దీక్ష ద్వారా సంకేతం పంపారు. ఓ విధంగా ఆమోదం కూడా పొందారన్నది టీడీపీ అభిప్రాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close