ఆ అభిమానుల‌కు జ‌న‌సేన సాయం ఉందా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ – మీడియాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు – త‌ద‌నంత‌ర ప‌రిణామాలు తెలిసిన‌వే. హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో మెగా ఫ్యామిలీ హంగామా త‌రువాత‌.. కొంతమంది అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ కి చెందిన ఓబీ వ్యాను, ఇండికా కారుపై దాడి ఘ‌ట‌న కూడా తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అభిమానుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు న‌మోదుచేశారు. అంతేకాదు, 14 రోజుల‌పాటు రిమాండ్ కి కోర్టు ఆదేశించింది. ఈ ఘ‌ట‌న‌లో దెబ్బ‌తిన్న మీడియా వాహ‌నాల‌కు బీమా సౌక‌ర్యం ఉంటుంది కాబ‌ట్టి, వారికి జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునే అవ‌కాశం ఉంది.

స‌రే, ఇదే విష‌యంపై మొన్న‌నే ప‌వ‌న్ స్పందించారు క‌దా! కుర్రాళ్లు కొంత‌మంది బ‌య‌ట వాహ‌నాల అద్దాలు ప‌గుల‌గొట్ట‌డం వంటివి చేస్తున్నార‌ని తన దృష్టికి పోలీసులు తీసుకొచ్చార‌నీ, అయితే తానేం రెచ్చ‌గొట్ట‌లేద‌ని ప‌వ‌న్ అన్నారు. వాళ్లని రెచ్చ‌గొడుతున్నది కూడా మీడియేన‌నీ, చాలారోజులుగా వాళ్ల‌కు ఆగ్ర‌హం తెప్పించే విధంగా మీడియా చేస్తోంద‌నీ, కాబ‌ట్టి వాళ్ల‌కి కోపం వ‌స్తోంద‌న్న‌ట్టుగా విశ్లేషించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యం మీడియాకి చెప్పండంటూ ఉల్టా క్లాస్ తీసుకున్నారు. అంటే, అభిమానం పేరుతో కొంత‌మంది చేస్తున్న ప‌నుల‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఉండ‌ద‌ని చెప్పిన‌ట్టే క‌దా. ఈ విష‌యంలో వారికి అండ‌గా నిలిచేదీ లేద‌ని చెప్పిన‌ట్టు. చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల‌పై కూడా స్పందించ‌ను అని చెప్పిన‌ట్టే క‌దా.

నిజానికి, పవన్ స్పందించే ప‌రిస్థితి కూడా లేద‌నే చెప్పాలి. ఎందుకంటే, ఈ ఘ‌ట‌న‌లో ఇరుక్కున్న అభిమానుల విష‌య‌మై ప‌వ‌న్ స్పందించి, సాయ‌మందించే ప్ర‌య‌త్నం నేరుగా చేస్తే… ప‌రోక్షంగా మీడియాపై దాడి ఘ‌ట‌నకు మ‌ద్ద‌తు ప‌లికిన‌ట్టు అవుతుంది. అలాగ‌ని, త‌న కోసం నిల‌బ‌డి, కల‌బ‌డిన అభిమానుల కోసం ప‌వ‌న్ ఏం చేస్తున్నారంటే… ఏమో, తెర వెనుక వారికి మ‌ద్ద‌తుగా నిలిచే ప్ర‌య‌త్నాలు ఏమైనా చేస్తున్నారో లేదో తెలీదు! అభిమానం పేరుతో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటే… వాటిపై బ‌హిరంగంగా ప‌వ‌న్ స్పందించ‌లేని ప‌రిస్థితి ఉంది. వాహ‌నాల‌పై దాడి ఘ‌ట‌న‌లో 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి వెళ్లిన అభిమానులకు జ‌న‌సేన సాయం ఉంటుందా, ఉండదా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

వంగా గీతకు మంత్రిపదవా ? ఆళ్ల, మర్రి, గ్రంధి నవ్వుకుంటారు జగన్ గారూ !

కుప్పం వెళ్లి అక్కడి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెబతారు జగన్ రెడ్డి, అక్కడ చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని జగన్ ఆయన మాటల్ని కామెడీ చేస్తారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close