ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తా..! మహానాడులో చెప్పేసిన చంద్రబాబు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో అన్ని రాష్ట్రాలకు వెళ్లి .. ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశమవుతానని మహానాడు వేదికగా ప్రకటించారు. అదీ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందే ఈ పర్యటనలన్నీ పూర్తి చేస్తానని… అందర్నీ కలుపుకుని పార్లమెంట్‌లో పోరాటం చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కులు, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో అందరి మద్దతూ కోరుతానని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలుగు 360 రెండు రోజుల కిందట.. చంద్రబాబు ప్రాంతీయ పార్టీల నేతలందర్నీ కలిసేందుకు రాష్ట్రాల పర్యటనలకు వెళ్లబోతున్నారని… చెప్పింది. ఆ విషయాన్ని మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ధృవీకరించారు.

ప్రాంతీయ పార్టీలతో పాటు.. వామపక్ష పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్న రాష్ట్రాలతో పాటు… ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలకూ చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పోరాటానికి మద్దతుగా అందర్నీ కూడగడుతున్నట్లు…చంద్రబాబు ప్రకటించారు. ఇందులో రాష్ట్ర ప్రయోజనాలతో పాటు… రాజకీయం కూడా ఉంది. ఏపీకి మద్దతుగా అందర్నీ కూడగట్టడటమంటే… ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏం చేయడమే. ఇప్పటికే బెంగళూరులో ..మమతా బెనర్జీ, మాయావతి.. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసుకున్న..చంద్రబాబు… ప్రాంతీయ పార్టీల కూటమిపై చురుగ్గా… వర్కవుట్ చేస్తేనే మంచిదని నిర్ణయించారు. దాని కోసం.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన అన్యాయం…అనే కాన్సెప్ట్ రెడీగా ఉంది కాబట్టి.. ఆయన వెంటనే రంగంలోకి దిగబోతున్నారు.

ఆగస్టులో జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందే.. చంద్రబాబు ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అప్పటికే అందర్నీ ఏకం చేసి…కేంద్రంపై.. ఎన్నికలకు ముందు సన్నాహాక సమరం చేయనున్నారు. గత పార్లమెంట్ సమావేశాల్లో… ప్రతి పక్ష పార్టీల మధ్య ప్రస్తుతం ఉన్నంత ఐక్యత లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందరూ.. ఒకే టాపిక్ మీద.. అది కూడా.. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన అన్యాయం మీద పోరాడటానికి.. చంద్రబాబు ఒప్పించబోతున్నారు. అంటే.. ఓ రకంగా.. మోదీ వ్యతిరేక కూటమి ట్రాక్‌పై ఎక్కుతున్నట్లే. ఆ తర్వాత ఏమిటన్నది.. ఎన్నికల తర్వాత తేలుతుంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్..!!

నేడు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేకపోవడంతో...

రామోజీ ఫిల్మ్‌సిటీని మ‌లేషియాగా మార్చేశారు!

'పుష్ష 2' షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం కంక‌ణం క‌ట్టుకొంది. అందుకు త‌గ్గ‌ట్టే రాత్ర‌న‌క, ప‌గ‌ల‌న‌క ప‌ని చేస్తోంది. ఈ సినిమా...

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ నోరు పెగలదేంటి..?

టీడీపీ నేతలకు తనదైన శైలిలో విరుచుకుపడే ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ ఇప్పటికీ బయటకు రాకపోవడంపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన ఎవరో కాదు.. కొడాలి నాని. పోలింగ్ ముగిసిన నాటి...

పరారీ లేకపోతే జైలు – జగన్‌ను నమ్ముకుంటే అంతే !

వైసీపీ అధినేత జగన్ ప్రశాంతంగా లండన్ పోయారు. కానీ ఆయన చెప్పినట్లుగా చేసిన..చేస్తున్న వారు అయితే పరారీలో ఉన్నారు లేకపోతే ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడాల్సి వస్తోంది. జగన్ పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close