పదవుల లెక్క తేల్చుకోలేని కాంగ్రెస్-జేడీఎస్..! కాలు తొక్కిన నాడే కాపురం చేసే కళ తెలుస్తోందా..?

కర్ణాటకలో కలసి కాపురం ప్రారంభించముందు కాంగ్రెస్-జేడీఎస్ సిగపట్లు పడుతున్నాయి. ప్రమాణస్వీకారం చేసి వారం దాటుతున్నా.. మంత్రులెవరో రెండు పార్టీలు నిర్ణయించుకోలేకపోతున్నాయి. శాఖల దగ్గర్నుంచి .. ఎవరెవరు మంత్రులనేదాని వరకూ.. ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. తమకు రెండు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని కాంగ్రెస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. అందుకు కుమారస్వామి నిరాకరించడంతో ఒక ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకుంది. ఇప్పుడు మలి దఫా చర్చల్లో అదే ప్రధానాంశమైంది. కాంగ్రెస్ నేత శివకుమార్ కు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుపడుతోంది. కుమారస్వామిపై ఒత్తిడి తెస్తోంది. కానీ కుమారస్వామి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శివకుమార్ కు డిప్యూటీ సిఎం ఇవ్వలేని పక్షంలో లింగాయత్ సామాజికవర్గానికి చెందిన నేతకు కేటాయించాలని కూడా కాంగ్రెస్ ప్రతిపాదించింది. దీనిపైనా కుమారస్వామి అంత సుముఖంగా లేరు.

మరో వైపు ఆర్థిక మంత్రిత్వ శాఖ కోసం రెండు పార్టీలు టగ్ ఆఫ్ వార్ ప్రారంభించాయి. ఆర్థిక శాఖ తమకే కావాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే సీఎంగా ఆర్థిక శాఖను కూడా తానే నిర్వహిస్తానని కుమారస్వామి తేల్చి చెబుతున్నారు. ఆర్థిక శాఖతో పాటు రెవెన్యూ, ప్రజా పనుల శాఖ ఇప్పుడు రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమవుతున్నాయి. ఈ మూడు శాఖలూ కోరిన కాంగ్రెస్ ఇప్పుడు రెండో ఉప ముఖ్యమంత్రి పదవి, ఆర్థిక శాఖను అప్పగిస్తే మిగతా రెండు శాఖలు వదులుకునేందుకు అభ్యంతరం లేదని ప్రతిపాదన పెట్టింది. కానీ కుమారస్వామి సిద్ధంగా లేరు. జేడీఎస్ కన్నా.. రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం పదవిని తాము వదులుకున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పదే పదే గుర్తు చేస్తోంది. బదులుగా ఆర్థిక, రెవెన్యూ, ప్రజాపనులు, గ్రామీణాభివృద్ధి, బెంగళూరు పట్టణాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్యం, గనులు లాంటి కీలక శాఖల్లో అత్యధికం తమ వద్దనే ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

కర్ణాటక కేబినెట్లో మొత్తం 34 మంది మంత్రులు ఉండొచ్చు. అందులో 22 మంత్రి పదవులు కాంగ్రెస్‌కు ఇస్తున్నారు. కానీ కీలకమైన శాఖలను మాత్రం వదులుకునేందుకు సిద్దపడటం లేదు. కాలు తొక్కిన నాడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్లుగా… శాఖల విషయంలోనే తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ – జేడీఎస్ రేపు పాలనలో వచ్చే సమస్యలపై ఎలా సమన్వయానికి వస్తుందన్నది పెద్ద పజిల్ గా మారింది. ఇప్పుడు కాకపోయినా రేపయినా…జేడీఎస్ ను డిక్టేట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అప్పుడు కుమారస్వామి కూడా ఎదురు తిరగడం ఖాయం. అదే జరిగితే ఇప్పుడు దేవేగౌడ.. అప్పుడప్పుడు బీజేపీని పొగుడుతున్నదానికి కొనసాగింపు రాజకీయం ఉంటుందేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close