హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న కృతి సనన్‌ సిస్టర్‌!

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరోల వారసులుగా, హీరోయిన్ల వారసులుగా చాలా మంది పరిచయమయ్యారు. కానీ, అందులో సక్సెస్‌ అయింది మాత్రం కొంతమందే. హీరోయిన్ల కూతుళ్ళు హీరోయిన్లుగా ఇండస్ట్రీకి వచ్చింది తక్కువనే చెప్పాలి. కానీ, హీరోయిన్ల చెల్లెళ్ళు హీరోయిన్లుగా పరిచయమై సక్సెస్‌ అయినవాళ్ళు చాలా మంది వున్నారు. అలా సక్సెస్‌ అయిన వారిలో అలనాటి నటిమణిలలో పద్మిని- రాగిణి – లలిత లు, షావుకారు జానకి – కృష్ణ కుమారి లు, తర్వాత అంబిక – రాధా లు, జయ సుధ – సుభాషిని లు, భానుప్రియ – శాంతిప్రియ, రాధిక – నిరోష, నగ్మా- జ్యోతిక లు వున్నారు. ఈ జనరేషన్‌కి వస్తే ఆర్తి అగర్వాల్‌ చెల్లెలు అదితి అగర్వాల్‌, కాజల్‌ అగర్వాల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌, సంజన చెల్లెలు నిక్కీ గల్రాని, విదీష చెల్లెలు శాన్వి…ఇలా చాలా పెద్ద లిస్టే వుంది.
ఇదంతా ఎందుకంటే ఇప్పుడు మరో హీరోయిన్‌ చెల్లెలు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మహేష్‌తో ‘1 నేనొక్కడినే’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కృతి సనన్‌ చెల్లెలు నుపూర్‌ సనన్‌ హీరోయిన్‌గా రాబోతోంది. ఇంతకుముందు ఏ సినిమాలోనూ నటించని నుపూర్‌ సడన్‌గా హీరోయిన్‌గా ఎలా ఎంటర్‌ అవుతోందీ అంటే దానికి ఓ కథ వుంది.
అదేమిటంటే ఈమధ్య షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘దిల్‌వాలే’ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కృతి సనన్‌ కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం కోసం అజిత్‌ సింగ్‌ – అంతర మిత్ర కలిసి పాడిన ‘జనమ్‌ జనమ్‌’ అనే పాట చాలా పాపులర్‌ అయింది. ఈ పాటను కృతి సనన్‌ చెల్లెలు నుపూర్‌ సనన్‌ పాడి ఈ సాంగ్‌ మేకింగ్‌తో కూడిన వీడియోను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. కేవలం పది రోజుల్లోనే ఈ పాటకు ఒక మిలియన్‌ పైగా వ్యూస్‌ వచ్చాయి. నుపూర్‌ సనన్‌ సింగరే కాకుండా మంచి అందగత్తె కావడంతో దర్శకనిర్మాతల దృష్టి ఆమెపై పడింది. దాంతో ఆమెకు హీరోయిన్‌ అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. అక్కలాగే తను కూడా హీరోయిన్‌ అయిపోవాలని ఈమధ్యే డిసైడ్‌ అయ్యిందట నుపూర్‌. దానికి కృతి ప్రోత్సాహం కూడా తోడవడంతో త్వరలోనే నుపూర్‌ సనన్‌ హీరోయిన్‌ తెరంగేట్రం చేస్తుందని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close