మోడీ రాజకీయానికి కొత్త ఆయుధం “కబీర్”

ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకుంటున్న సమయంలోనే నరేంద్రమోదీ.. గేర్ మారుస్తున్నారు. యూపీలో మెజార్టీ సీట్లు సాధించకపోతే.. అధికారం కల్ల అని తేలడంతో.. అక్కడే దృష్టి పెట్టారు. అనధికారికంగా ఈ రోజు నుంచి యూపీలో ప్రచారపర్వం ప్రారంభిస్తున్నారు. అదీ కూడా.. పట్టు సాధించాల్సిన తూర్పు యూపీ నుంచి శంఖరావం పూరిస్తున్నారు. మోదీ తాను గత ఎన్నికల్లో గెలిచిన వారణాసికి పూర్తి భిన్నమైన కబీర్‌ నగర్‌లో మోదీ పర్యటన ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నాలుగేళ్లలో మోడీ ఎప్పుడీ కబీర్‌ను గుర్తుకు తెచ్చుకోలేదు. కానీ హఠాత్తుగా కబీర్‌పై పొగడ్తలు గుప్పించిన మోదీ.. సడెన్‌గా ఆయన సమాధికి చాదర్‌ సమర్పించేందుకు వెళ్తున్నారు.

మగర్‌… కబీర్‌ సమాధి స్థలం. ఇపుడు మోదీకి ఈ పేరు గుర్తుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా యూపీలోని అగ్రవర్ణాలకు మోదీ నిర్ణయం ఏ మాత్రం నచ్చడం లేదు. వారణాసి విరుద్ధం మగర్‌. వారణాసి స్వర్గానికి దారి చూపితుందన్న ప్రసిద్ధి ఉంటే.. మగర్‌లో మరణిస్తే నరకానికి వెళ్తారంటారు. కానీ అప్పటి అగ్రవర్ణాల తీరుతో విభేదించిన కబీర్‌ సాధువు… వారణాసి నుంచి కాకుండా మగర్‌లో సమాధి అయ్యారు. అయితే ఇపుడు కబీర్‌ సమాధికి చాదర్‌ సమర్పించాలని మోదీ నిర్ణయించడంతో.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయొచ్చన్న ఉహాగానాలు ఊపందుకుంటున్నాయి.

మోడీ కబీర్‌ నామ జపం వెనుక భారీ వ్యూహం ఉంది. కబీర్‌కు తూర్పు యూపీలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కబీర్‌ పంతీస్‌ అంటూ భారీ అనుచరణ వర్గం కూడా యాక్టివ్‌గా ఉంది. వీరిలో అత్యధికులు దళితులు. అంతేకాదు.. ముస్లింలలోనూ కబీర్‌పై సానుకూలత ఉంది. అయితే ఇపుడు వారిని ఆకట్టుకునేందుకు మోదీ కబీర్‌ జపం చేస్తున్నారు. దళితులు, మైనార్టీ వర్గాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉంది. ఇపుడు కబీర్‌ పేరుతో ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం మోదీ చేస్తున్నారు. దానికి ఈ రోజే ముహుర్తం పెట్టుకున్నారు. మోడీ రాజకీయ ఎత్తుగడలు అన్నీ ఇలాగే ఉంటాయి. ఎంత వరకు సక్సెస అవుతాయన్నది ఎన్నికల తర్వాతే తేలుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close