మురళి మోహన్ గారూ, ఒకసారి వీరమాచినేని ట్రై చేయొచ్చుగా..

తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలో తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుంటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో నిరాహారదీక్షలని, రైల్వే జోన్ తదితర డిమాండ్లని వెటకారం చేస్తూ ఎంపీలు మాట్లాడడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అందరిలోకి మురళీమోహన్ వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి.

ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జోన్ లేదు గీన్ లేదు అని నవ్వుతూ అంటే దానికి సమాధానంగా మురళీమోహన్, “ఏమండీ, నాకు ఒక 5 కేజీల బరువు తగ్గాలని ఉంది కాబట్టి నేను ఒక వారం రోజుల పాటు దీక్ష కూర్చుంటాను” అని వెటకారంగా అనడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నా మధ్యనే “వెంకన్న చౌదరి” అంటూ వ్యాఖ్యలు చేసి ఆనక లెంపలేసుకున్న మురళి మోహన్ గారు మళ్ళీ ఇంత వెటకారంగా మాట్లాడడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది మురళీమోహన్ గారికి నిజంగా అంత గా బరువు తగ్గాలనే సరదా ఉంటే దానికి చాలా పద్దతులు ఉన్నాయి . ఈ మధ్యనే వీరమాచినేని అని ఒక బరువు తగ్గే పద్ధతి బాగా ప్రాచుర్యం అవుతోంది. టీవీల్లో కూడా దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. బహుశా ఆయన వాటిని ప్రయత్నించడం మంచిది.

ప్రజల విజ్ఞప్తి ఏంటంటే – ఒకవేళ బరువు తగ్గాలనుకుంటే మురళి మోహన్ గారు ఇలాంటి పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు అంతేతప్ప స్వామికార్యం, స్వకార్యం అంటూ తాము బరువు తగ్గడం కోసం దీక్షకు కూర్చుని, ప్రజల కోసమే దీక్షలు చేస్తున్నామంటూ బిల్డప్పులు ఇచ్చి ప్రజల్ని మోసం మాత్రం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి మోసపూరితమైన మాటలు, చేష్టలు ఎన్నో విని, చూసి విసిగిపోయి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా మళ్ళీ ఇలాంటి మోసపూరితమైన, స్వలాభం కోసం చేసే పనులకు దిగవద్దని ఎంపీ గారిని ప్రజలు సవినయంగా కోరుతున్నారు

-జురాన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close