క్రెడిట్‌ గేమ్‌లో బీజేపీ అతి తెలివి..! పరువు తీసేసిన కేటీఆర్..!!

తెలుగు రాష్ట్రాల్లో ఏ మంచి పని జరిగినా.. భారతీయ జనతా పార్టీ నేతలు.. తక్షణం.. అదంతా మోడీ మహిమేనని ప్రచారం మొదలు పెట్టేస్తారు. మొదటగా ట్వీట్ చేస్తారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. అవకాశం వచ్చినప్పుడు బహిరంగసభల్లో చెప్పుకుంటారు. వీరు ఆడే క్రెడిట్ గేమ్ ఎలా ఉంటుందంటే.. సహజంగా.. పన్నుల వాటాల్లో రాష్ట్రాలకు వచ్చే సొమ్ములు కూడా.. ఊదారంగా.. మోడీ సొంత డబ్బులు ఇస్తున్నట్లు చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే దానికి బీజేపీనే కారణమని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి క్రెడిట్‌ గేమ్‌లో తన అతి తెలివి తేటలను.. ట్విట్టర్‌లో బహిరంగ పరిచి పరువు పోగొట్టుకుంది.. భారతీయ జనతా పార్టీ. మంత్రి కేటీఆర్ ఆ పరువు తీసేశారంటే కరెక్ట్‌గా ఉంటుంది.

అసలేం జరిగిందంటే… సిరిసిల్లలో… ఓ కార్పొరేట్ సంస్థ సాయంతో..ఓ ప్రభుత్వ బడికి రైలు ఆకారంలో పెయింటింగ్‌తో పాటు ఇతర హంగులు సమకూర్చారు. “రైలుబడి” అనే ఓ జపాన్ పుస్తకం..చాలా మంది విద్యావేత్తలకు మార్గదర్శకం. ఈ స్ఫూర్తితో ఆ స్కూల్‌కి అలా రూపకల్పన చేశారు. పిల్లల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచాలనుకున్నారు. ఇది సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన కేటీఆర్‌ను ఆకర్షించింది. తన ట్విట్టర్‌లో ఆ స్కూల్ ఫోటోలు పెట్టారు. సీఎస్ఆర్ నిధుల సాయంతో బడికి కొత్త రూపు వచ్చిందని.. సంతోషం వ్యక్తం చేశారు. సీఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటి. దీని కింద కార్పొరేట్ సంస్థలు కచ్చితంగా రెండు శాతం ఆదాయాన్ని సమాజసేవకు ఖర్చు పెట్టాలి. ఈ కోటాలో ఓ సంస్థ ఈ స్కూల్‌కు ఆర్థిక సాయం చేసింది.

అయితే ఈ సీఎస్‌ఆర్‌… తెలంగాణ బీజీపేకి.. ఎస్‌సీఆర్‌ లా అర్థం అయింది. అంటే.. సౌత్ సెంట్రల్ రైల్వేలా కనిపించింది. పైగా రైలు బొమ్మలు రైల్వే వాళ్లే వేస్తారన్నంత తెలివి తేటల్నిచూపించారు. వెంటనే కేటీఆర్ ట్వీట్ చేసిన ఫోటోను డౌన్‌లోడ్ పెట్టేసుకుని… క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. ఈ ట్వీట్ కేటీఆర్ కంట పడింది. తలదించుకునేలా పంచ్ వేశారు. ప్రతీ దాన్ని తమ ఘనతేనని చెప్పుకోవడానికి చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉందని… పంచ్ వేసి పరువు తీసేశారు. ఇది వైరల్ కావడంతో.. బీజేపీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసుకుంది. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది. బీజేపీ ఇజ్జత్ సోషల్ మీడియాలో పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close