ఈడీ చార్జిషీట్‌కు ఐదేళ్లు ఎందుకు పట్టింది..? గూడుపుఠాణి ఉందా..?

రఘురామ్ సిమెంట్స్ అలియాస్ భారతి సిమెంట్స్ క్విడ్ ప్రో కో వ్యవహారంలో.. సీబీఐ 2013లోనే చార్జిషీట్ దాఖలు చేసింది. ఇతర సీబీఐ చార్జిషీట్లను ఆధారంగా చేసుకుని … ఈడీ అప్పటికప్పుడు చార్జిషీట్లు దాఖలు చేసింది. కానీ భారతి సిమెంట్స్ విషయంలో మాత్రం ఆలస్యం చేసింది. ఆ కంపెనీ వ్యవహారంలో ఈడీకి సాక్ష్యాలు ఏమీ దొరకలేదని అనుకున్నారు అందరూ. కానీ హఠాత్తుగా.. నెల రోల కిందట… ఈ వ్యవహారానికి సంబంధించి చార్జిషీటు దాఖలు చేసింది. అది రెండు రోజుల కిందట మీడియాకు తెలిసింది. ఈ గ్యాప్‌నే చూపించి జగన్మోహన్ రెడ్డి.. కుట్ర జరిగిందనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈడీ అధికారులు అంత కంటే ప్లానింగ్‌తోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్న భారతి సిమెంట్స్ సంస్థ ..మొదట రఘురాం సిమెంట్స్ గా ఉండేది. కొన్ని మైనింగ్ లీజులు తీసుకుని పేపర్లపైనే ఉన్న ఆ సంస్థను… వైఎస్ ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే జగన్ కొనుగోలు చేశారు. ఆ సంస్థ పేరును తన భార్య భారతి పేరుపైకి మార్చారు. ఆమెను కీలక వాటాదారుగా చేశారు. ఆ తర్వాత ఆ సంస్థలోకి పెట్టుబడుల వరద వచ్చి పడింది. ఈ కంపెనీ కోసం జగన్ పెట్టిన పెట్టుబడి.. లక్షల్లోనే ఉంది. వచ్చిన పెట్టుబడులు మాత్రం వందల కోట్లకు చేరాయి. ఉత్పత్తి ప్రారంభం అవగానే.. ఈ కంపెనీలో 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికాట్ కు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలకు అమ్మేశారు. అప్పుడప్పుడే ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీని .. అంత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. మెజార్టీ షేర్ ఫ్రాన్స్ కు చెందిన వికాట్ కంపెనీ చేతుల్లో ఉన్నప్పటికీ.. ఆ కంపెనీ తరపున భారతి సిమెంట్స్ బోర్డులో నామమాత్రపు ప్రతినిధులే ఉన్నారు. జగన్ కుటుంబంలోని వ్యక్తులే.. ప్రస్తుతం భారతీ సిమెంట్స్ మొత్తాన్ని నడిపిస్తున్నారు.

రఘురామ్ సిమెంట్ ఎదుగుదలపై లోతుగా దర్యాప్తు చేసిన ఈడీ.. మొత్తం గుట్టు బయటకు లాగినట్లు ప్రచారం జరుగుతోంది. విదేశాల నుంచి రావాల్సిన సమాచారం కోసం . ఈడీ గతంలోనే.. ఆయా దేశాలకు లేఖలు రాసింది. వాటికి సంబంధించిన సమాచారం అందడం వల్లే .. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వికాట్ కంపెనీ పెట్టుబడులు… వాటిని భారత్ కు తీసుకురావడం.. అలాగే భారతి సిమెంట్స్ లో ఇండియా సిమెంట్స్ తో పాటు.. ఇతర క్విడ్ ప్రో కో పెట్టుబడులు గురించిన మొత్తం సమాచారం సేకరించిన తర్వాతే ఈడీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నెల రోజులుగా కోర్టు పరిశీలనలో కేసు ఉంది. మరో రెండు, మూడు వారాల్లో సీబీఐ కోర్టు ఈ చార్జిషీటును పరిగణనలోకి తీసుకుని… సమన్లు జారీ చేసే అవకాశం ఉందని… న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close