జ‌మిలి ఎన్నిక‌ల‌పై మోడీ స్వ‌రం మారుతోందా..?

లోక్ స‌భ‌, అసెంబ్లీల‌కు క‌లిపి ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని భాజ‌పా చాన్నాళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కోరారు క‌దా! అయితే, ఈ మ‌ధ్య‌నే జ‌మిలిపై వివిధ రాజ‌కీయ పార్టీల‌తో లా క‌మిష‌న్ భేటీ అయింది. చాలా పార్టీలు జ‌మిలికి సుముఖంగా లేవ‌నే అభిప్రాయ‌మే వ్య‌క్తమైంది. ఈ నెల 31లోగా లా క‌మిష‌న్ గ‌డువు ముగుస్తుంది. అంటే, ఈలోగా కేంద్రానికి ఒక నివేదిక ఇస్తుంది. జ‌మిలి ఎన్నిక‌లో నిర్వ‌హించాలంటే ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టంలో స‌వ‌ర‌ణ చేయాల్సి ఉంద‌నేది నిపుణుల అభిప్రాయం. దీంతోపాటు, కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా జ‌మిలి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఇబ్బందుల్ని ఇటీవ‌లే తేల్చిచెప్పింది.

రాజ‌కీయంగా చూసుకుంటే భాజ‌పాకి జ‌మిలి అవ‌స‌రం ఉంద‌నే అభిప్రాయమే వ్య‌క్తమౌతోంది. 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్ని లోక్ స‌భ‌తో క‌లిపి నిర్వ‌హించాల‌ని వారు చేయాల్సిన ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. అయితే, ఆ క‌థ‌నాల్లో వాస్త‌వం లేదంటూ తాజాగా భాజ‌పా తోసిపుచ్చ‌డం విశేషం..! అంతేకాదు, 11 రాష్ట్రాల్లోని వివిధ రాజ‌కీయ పార్టీల‌తో ఏకాభిప్రాయం సాధించేందుకు భాజ‌పా ప్ర‌య‌త్నిస్తోందన్న క‌థ‌నాల్లో వాస్త‌వం లేదంటూ ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి సంభిత్ పాత్రా ఖండించారు! లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ఒకేసారి నిర్వ‌హిస్తే మంచిద‌నేది మాత్ర‌మే తమ ప్ర‌తిపాద‌న అనీ, దీని కోస‌మ‌నీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నిక‌ల్ని ముందుకు జ‌ర‌ప‌డ‌మూ, మ‌రికొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రప‌తి పాలన విధించ‌డం లాంటి ఆలోచ‌న‌లు ఏవీ భాజ‌పా చేయ‌డం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

నిజానికి, జ‌మిలికి వెళ్ల‌క‌పోతే భాజ‌పా పాలిత రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ త‌ప్ప‌ద‌నే అంశ‌మే ప్ర‌స్తుతం భాజ‌పాలో చ‌ర్చ‌నీయంగా ఉంద‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి! మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌డ్‌, రాజ‌స్థాన్ ల‌లో భాజ‌పాకి ఎదురుగాలి వీస్తోందంటూ కొన్ని స‌ర్వేలు చెబుతున్నాయి. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మూడు రాష్ట్రాల్లో ఓట‌మి ఎదురైతే… అది భాజ‌పాకి చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితే అవుతుంది. అందుకే, 11 రాష్ట్రాలూ కాక‌పోయినా.. క‌నీసం ఆ మూడు రాష్ట్రాల‌నైనా లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో క‌లిపి జ‌ర‌పాల‌న్న‌ది ప్ర‌ధాని మోడీ అభిప్రాయంగా భాజ‌పా వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ, వాస్తవ ప‌రిస్థ‌ితులు వేరుగా క‌నిపిస్తున్నాయి. సాంకేతికంగా సమస్యలు చాలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అందుకేనేమో… జ‌మిలిపై తాము చేస్తున్న ప్ర‌య‌త్నాల‌న్నీ కేవ‌లం ప్ర‌తిపాద‌న‌లు మాత్ర‌మే అనే అభిప్రాయాన్ని ఇప్ప‌ట్నుంచీ చిన్న‌గా వినిపించ‌డం మొద‌లుపెట్టించారు ప్ర‌ధాని మోడీ..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close